News February 6, 2025

పాముకాటుతో చిన్నారి మృతి

image

చాగలమర్రి మండలం నగళ్లపాడు గ్రామానికి చెందిన ప్రణయ్ కుమార్ రెడ్డి(4) అనే బాలుడు బుధవారం రాత్రి పాముకాటుతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన రవి కుమార్ రెడ్డి కుమారుడు ప్రణయ్ కుమార్ రెడ్డి చాగలమర్రిలోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి ఆవరణలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటుకు గురై మృతిచెందాడు.

Similar News

News November 26, 2025

భద్రాచలం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా మానే రామకృష్ణ..!

image

భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మానే రామకృష్ణ భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు వివరాలు వెల్లడించారు. భద్రాచలం సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పలు పార్టీలతో స్థానికంగా పొత్తులు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. రేపు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News November 26, 2025

ఉత్తరం దిశలో తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు?

image

ఉత్తరం దిశలో తలపెట్టి నిద్రించడం ఆరోగ్యానికి మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఆ దిశలో ప్రవహించే అయస్కాంత తరంగాలు మెదడు శక్తిని తగ్గిస్తాయని అంటున్నారు. ‘ఇలా పడుకుంటే రక్త ప్రసరణలో ఒడిదొడుకులు కలుగుతాయి. దీనివల్ల నిద్రలేమి, పీడకలలు, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. శాస్త్రానుసారం.. మెదడుపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండటానికి ఈ దిశను నివారించడం ఉత్తమం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 26, 2025

కస్టమర్లను అలర్ట్ చేసిన SBI

image

తమ పేరుతో వాట్సాప్‌లో APK ఫైల్స్ పంపుతూ మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతుండటంపై SBI స్పందించింది. KYC అప్డేట్, రివార్డ్ పాయింట్స్ అంటూ సైబర్ నేరగాళ్లు పంపే SMS/వాట్సాప్ మెస్సేజ్‌లను నమ్మి మోసపోవద్దని సూచించింది. SBI ఎప్పుడూ apk ఫైల్స్ & లింక్స్ పంపదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫైల్స్‌ను క్లిక్ చేస్తే డేటా అంతా నేరగాళ్లకు చేరుతుందని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మోసపోతే 1930కి కాల్ చేయాలని కోరింది.