News March 27, 2025
పామ్ ఆయిల్ రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి MP వినతి

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు పామాయిల్ తోటల సాగుకు అనువైనవని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ జిల్లాల్లో పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. నాసిరకమైన విత్తనాలు, నర్సరీల్లో అవినీతి, అధికారుల నుంచి సరైన అవగాహన సదస్సులు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.
Similar News
News November 12, 2025
శ్రీకాకుళం: 13 నుంచి పదవ తరగతి ఫీజు చెల్లింపునకు అవకాశం

పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీజును ఈనెల 13 నుంచి 25 వరకు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు చెప్పారు. జిల్లాలోని 450 ప్రభుత్వ, 196 ప్రైవేట్ పాఠశాలల్లో 22,890 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం అందించాలని చెప్పారు. గడువు దాటితే అపరాధ రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
News November 12, 2025
పాలమూరు: డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ పొడిగింపు

PU పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ను అధికారులు పొడిగించారు. వాస్తవానికి నేటితో ముగియాల్సిన పరీక్షలను ఈ నెల 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ అనుబంధ కళాశాలలన్నీ ఈ గడువును వినియోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలను విద్యార్థులు www.palamuruuniversity.com వెబ్సైట్లో చూసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
News November 12, 2025
భీష్ముడిని, ధర్మరాజు ఏం అడిగాడంటే?

కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః|
కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్||
భావం: అన్ని ధర్మాలలో ఉత్తమ ధర్మం ఏది? దేనిని జపిస్తే జీవులు జన్మ సంసార బంధనాల నుంచి విముక్తి పొందుతారు? అని ధర్మరాజు, భీష్ముడిని అడిగారు. మోక్ష సాధన మార్గాన్ని, సర్వ శ్రేయస్సుకు దారితీసే ఏకైక మార్గాన్ని తెలుసుకోవాలనే ధర్మరాజు జ్ఞాన జిజ్ఞాస ఈ ప్రశ్నలలో వ్యక్తమవుతోంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


