News January 24, 2025

పాయకరావుపేటలో ఎయిర్ పోర్ట్‌కు ప్రతిపాదనలు

image

పాయకరావుపేటలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ముందు తుని-అన్నవరం మధ్య ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రాంతం అనుకూలం కాదని ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు సమాచారం. పాయకరావుపేట ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉండడంతో నిర్మాణానికి అన్ని విధాల అనుకూలమని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు భూముల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Similar News

News October 26, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండండి: జీవీఎంసీ కమిషనర్

image

తుఫాను కారణంగా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. సహాయక చర్యల కోసం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ (0891-2507225), టోల్ ఫ్రీ నంబర్ (1800-425-0009) ఏర్పాటు చేశామన్నారు. లోతట్టు, కొండవాలు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, తప్పుడు సమాచారం నమ్మవద్దని సూచించారు.

News October 25, 2025

నగరంలో క్రైమ్ రేట్ తగ్గించాలి: సీపీ శంఖబ్రత బాగ్చి

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఈనెల రివ్యూ మీటింగ్‌లో పోలీసు అధికారుల పనితీరుపై సమీక్షించారు. నగరంలో గంజాయి రవాణాను పూర్తిగా నిరోధించాలని, రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని ఆయన ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, క్రైమ్ రేటు తగ్గించేలా రాత్రి నిఘా పటిష్ఠం చేయాలని సూచించారు. మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, విధుల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 25, 2025

విశాఖ: డెలివరీ బ్యాగ్‌లో గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్

image

డెలివరీ బ్యాగులను అడ్డుగా పెట్టుకుని గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పీఎంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. కోమ్మాది ప్రాంతంలో నిర్వహించిన దాడిలో నల్లబిల్లి గణేశ్ (32), సంజయ్‌కుమార్ (29)ని పట్టుకున్నారు. ​వారి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ ప్రజలను కోరారు.