News February 15, 2025

పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన కలెక్టర్

image

ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. కరకంబాడి గ్రామ పంచాయతీ తారకరామనగర్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. చెత్త నుంచి సంపద కేంద్రాన్ని పరిశీలించారు. పలువురు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి కిట్లను పంపిణీ చేశారు.

Similar News

News December 5, 2025

పంచాయతీ ఎన్నికలు.. తొలి విడతలో 395 స్థానాలు ఏకగ్రీవం

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 స్థానాలు ఉన్నాయి. అటు సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌లో 26 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఓవరాల్‌గా 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలవ్వలేదు. మిగిలిన 3,836 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. కాగా మూడో విడత ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది.

News December 5, 2025

వరంగల్ స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం.. సీఎం దృష్టి పెడతారా?

image

ఎంపీ ఎన్నికల సందర్భంగా వరంగల్ అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్లో అనేక పనులు ఇంకా నిలిచిపోయాయి. మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణకు రూ.150 కోట్లు, భద్రకాళి చెరువు పూడికతీత, మాడ వీధులు, స్మార్ట్‌సిటీ పనులు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ డీపీఆర్ సహా మొత్తం రూ.6,500 కోట్ల ప్రాజెక్టులు పురోగతి లేక నిలిచాయి. ఔటర్, ఇన్నర్ రింగ్‌రోడ్లు, మేడారం, గిరిజన వర్సిటీకి నిధులు త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు.

News December 5, 2025

విశాఖ: నమ్మించి రూ.1.97 కోట్లు కాజేశారు

image

మహిళను నమ్మించి ఆన్‌లైన్‌లో రూ.1.97 కోట్ల పెట్టుబడి పెట్టించి మోసం చేసిన తండ్రి కొడుకును 1 టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సదరం శివ, ప్రేమ సాగర్ అక్కయ్యపాలెంకు చెందిన రమ్య రాజాకు ఆశ చూపించి ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టించడంతో పాటు 75 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టించి డబ్బులు కాజేశారు. తన డబ్బులు ఇవ్వమని రమ్య అడగటంతో ఇబ్బందులకు గురి చేయాగా ఆమె పోలీసులును ఆశ్రయించారు