News July 18, 2024

పారిశుద్ధ్య లోపం.. విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు

image

వర్షాకాలం ప్రారంభమవడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించడంతో ఖమ్మం జిల్లా ప్రజలు డెంగ్యూ జ్వరాల బారిన పడి మంచం పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడటంతో ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో ఇప్పటి వరకు 18 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు.

Similar News

News November 28, 2025

ఖమ్మంకు ఎన్నికల పరిశీలకులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖర్తడే కాళిచరణ్ సుధామరావు (ఐఏఎస్) గురువారం ఖమ్మం జిల్లాకు విచ్చేశారు. ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి స్వాగతం పలికారు. అనంతరం పరిశీలకులు, కలెక్టర్‌తో కలిసి సంబంధిత అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని పరిశీలకులు అధికారులను ఆదేశించారు.

News November 28, 2025

ఖమ్మం పల్లెల్లో ఎన్నికల జ్వరం..!

image

ఖమ్మం జిల్లాలో ఎన్నికల నియమాలు అమల్లోకి రావడంతో, పల్లెల్లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరిని నిలపాలి? ఏ కుటుంబానికి గ్రామంలో బలం ఉంది? అన్న మాటలే మార్మోగుతున్నాయి. ప్రజలు గతంలో పనిచేసిన, గ్రామానికి ఉపయోగపడిన వ్యక్తుల గురించి చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు, కుటుంబ బలం, వర్గ ఓట్లపై రాజకీయ పార్టీలు నిశితంగా లెక్కలు వేసుకుంటూ, వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

News November 28, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మంలో ముమ్మరంగా రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ
∆} ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} ముదిగొండలో ఎన్నికల నిబంధనలపై ఏసీపీ అవగాహన కార్యక్రమం
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు