News March 27, 2025

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి కృషి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల సదస్సు బుధవారం విజయవాడ సచివాలయంలో రెండవ రోజు జరగగా.. జిల్లా ప్రగతిపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం కింద జిల్లాలో 5000 హెక్టార్లలో రైతులు పంటలు పండించడానికి ఆమోదం తెలిపి ఉన్నారని పేర్కొన్నారు.

Similar News

News December 10, 2025

పోలింగ్ తేదీల్లో సెలవు.. కామారెడ్డి కలెక్టర్ కీలక ఆదేశాలు..

image

కామారెడ్డి జిల్లాలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల సందర్భంగా, పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలకు ప్రభుత్వ సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే (డిసెంబర్ 11, 14 & 17) ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలకు సెలవు ఉంటుంది. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే ఉద్దేశంగా ఈ వీలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

News December 10, 2025

బ్లాక్ మెయిల్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండండి: DEO

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని DEO వెంకట లక్ష్మమ్మ మంగళవారం సూచించారు. ఎటువంటి కాల్స్ వచ్చినా రికార్డ్ చేయాలన్నారు. వాటిని లిఖితపూర్వకంగా సంబంధిత పోలీసులకు అందజేయాలన్నారు. కాల్స్‌కు భయపడి ఎవరికి నగదు చెల్లించవద్దని పేర్కొన్నారు.

News December 10, 2025

సంగారెడ్డిలో 1100 మందితో ఎన్నికల బందోబస్తు

image

సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత ఏడు మండలాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు 1,100 మంది పోలీసు అధికారులతో భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పరీతోష్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 129 సర్పంచ్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఉంటుందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.