News March 27, 2025

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి కృషి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల సదస్సు బుధవారం విజయవాడ సచివాలయంలో రెండవ రోజు జరగగా.. జిల్లా ప్రగతిపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం కింద జిల్లాలో 5000 హెక్టార్లలో రైతులు పంటలు పండించడానికి ఆమోదం తెలిపి ఉన్నారని పేర్కొన్నారు.

Similar News

News April 20, 2025

VZM: మహిళ దారుణ హత్య

image

విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం. పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభీమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న భవాని శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా దుండగులు చాక్‌తో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 20, 2025

ఏలూరు: జిల్లా వ్యాప్తంగా లాడ్జీల్లో తనిఖీలు

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు లాడ్జీలను శనివారం అర్ధరాత్రి తనిఖీ చేశారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ల పరిధిలో ఆయా డీఎస్పీల ఆధ్వర్యంలో ఎస్ఐ, సీఐలు సంయుక్తంగా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా లాడ్జిలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని లాడ్జి నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సారథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి.

News April 20, 2025

ధోనీ పరిస్థితులను తలకిందులు చేయగలడు: రోహిత్

image

ధోనీ సామర్థ్యం, అనుభవాన్ని రోహిత్ కొనియాడారు. ధోనీతో అంత ఈజీ కాదని చెప్పారు. ‘మహీ ఎన్నో మ్యాచులకు కెప్టెన్‌గా చేశారు. ఎన్నో ట్రోఫీస్ గెలిపించారు. అలాంటి వ్యక్తి ప్రత్యర్థిగా ఉంటే మనం రిలాక్స్ అవ్వకూడదు. మనం వారిపై ఆధిక్యంలో ఉన్నా.. ఒక సడెన్ మూవ్‌తో మనల్ని ప్రెజర్‌లోకి నెట్టగలడు. ధోనీ ఉంటే.. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు.

error: Content is protected !!