News December 24, 2024
పారిశ్రామిక హబ్గా రాయలసీమ!

ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ పార్క్లో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుతో రాయలసీమ రూపురేఖలు మారనున్నాయి. జపాన్ సంస్థ ₹14వేల కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా ప్రత్యక్షంగా 2వేలు, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించే అవకాశముందని చెబుతున్నారు. దీనికి అనుబంధంగా మరిన్ని కంపెనీలు రానున్నాయి. వేలాది మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉండటంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Similar News
News October 16, 2025
రూ.13,429 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టనున్నారు. మొత్తంగా రూ.13,429 కోట్ల మేర అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. వీటిల్లో రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయనుండగా.. రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రూ.2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.
News October 15, 2025
ఇండస్ట్రీ పార్టనర్షిప్ డ్రైవ్ పోస్టర్లను ప్రారంభించిన మంత్రులు

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలులో బుధవారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(APIIC) నిర్వహించిన ఇండస్ట్రీ పార్టనర్షిప్ డ్రైవ్ పోస్టర్లను రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
News October 15, 2025
పీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు: సీఎం

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని జిల్లా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కర్నూలు కమాండ్ కంట్రోల్ నుంచి కలెక్టర్ సిరి, పీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ వీరపాండ్యన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వేదిక వద్ద భద్రత, పార్కింగ్, నీటి సదుపాయాలు కల్పించాలని సీఎం సూచించారు.