News May 25, 2024

పారుపాక మాజీ సర్పంచి అనుమానాస్పద మృతి

image

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని పారుపాక మాజీ సర్పంచి గాడి నూకరాజేశ్వరరావు(58) బావిలో శవమై కనిపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల జరిగిన ఎన్నికల విషయమై గ్రామంలోని గానుగచెట్టు దిమ్మె వద్ద గురువారం రాత్రి నూకరాజేశ్వరరావుకు మరో వ్యక్తికి మధ్య గొడవ జరిగింది. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన నూకరాజేశ్వరరావు బావిలో శవమై తేలారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు SI అబ్ధుల్ నబీ తెలిపారు.

Similar News

News December 10, 2025

ధాన్యం కొనుగోలులో పారదర్శకత అవసరం: జేసీ

image

ధాన్యం కొనుగోలులో గోనె సంచులు, రవాణా, కొలతలు, చెల్లింపులు వంటి అన్ని అంశాల్లో పారదర్శకత ఉండాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని.. ప్రతి సమాచారం రైతులకు, మీడియాకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

News December 10, 2025

రాజమండ్రి: విద్యాభివృద్ధిలో తరగతి పరిశీలన కీలకం- DEO

image

పాఠశాల విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలో దోహదపడే తరగతి పరిశీలన చిత్తశుద్ధితో నిర్వహించాలని DEO కె.వాసుదేవరావు సూచించారు. గత 2రోజులుగా స్థానిక దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్‌లో జరుగుతున్న సీఆర్‌ఎంటీలు, ఉపాధ్యాయుల “టీచ్ టూల్ అబ్జర్వేషన్ శిక్షణ” తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

News December 10, 2025

రాజమండ్రిలో ఈనెల 12న జామ్ మేళా!

image

రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని ఆమె సూచించారు.