News April 16, 2025
పార్కింగ్ స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రులు

రజతోత్సవ సభకు వేలాది వాహనాలు తరలివస్తాయని, పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఎల్కతుర్తి రజతోత్సవ సభ ప్రాంగణంలోని పార్కింగ్ స్థలాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆయన పరిశీలించారు. వచ్చే కార్యకర్తలకు, సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూడాలని సూచించారు.
Similar News
News December 3, 2025
పాలమూరు: నేడు ఉపసంహరణ, గుర్తు కేటాయింపు

పాలమూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు నేడు మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. నామినేషన్ పత్రంలో అభ్యర్థి పేరు ఎలా నమోదైందో, ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగా తెలుగు అక్షర క్రమానుసారం గుర్తుల కేటాయింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.
News December 3, 2025
కరీంనగర్: అభ్యర్థులకు గుర్తులు కేటాయించేది నేడే

గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండడంతో నేడు అభ్యర్థుల తుది జాబితా ఖరారు కానుంది. కాగా, ఇవాళే పంచాయతీలవారీగా బరిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికల అధికారులు గుర్తులను కేటాయిస్తారు. దీంతో అభ్యర్థులు గుర్తులతో ప్రచారం చేసుకోవచ్చు. మరోవైపు రెండో విడత నామినేషన్ల పరిశీలన కొనసాగుతుండగా మూడో విడత నామినేషన్ల ప్రక్రియా నడుస్తోంది.
News December 3, 2025
NZB: 1,760 వార్డులకు 3,764 నామినేషన్లు దాఖలు

జిల్లాలో జరగబోయే 2వ విడత GP 1,760 వార్డు మెంబర్ల (WM) పదవులకు 240 నామినేషన్లు రాగ మొత్తం 3,764 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు చెప్పారు. ఇందులో ధర్పల్లి మండలంలోని 194 WMలకు 417, డిచ్పల్లి(M) 306 WMలకు 621, ఇందల్ వాయి(M) 198 WMలకు 412, మాక్లూర్ (M) 230 WMలకు 466, మోపాల్ (M) 192 WMలకు 425, NZB రూరల్(M) 172 WMలకు 348, సిరికొండ (M) 264 WMలకు 583, జక్రాన్ పల్లి (M) 204 WMలకు 492 నామినేషన్లు వచ్చాయి.


