News August 10, 2024
పార్క్ల అభివృద్ధికి స్థలాలు గుర్తించాలి: కలెక్టర్ బాలాజీ

జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధి చేయడాని అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్ హాల్లో కలెక్టర్, జేసీ గీతాంజలి శర్మతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి భూముల లభ్యతను సమీక్షించారు. ఈ ప్రాజెక్టు సీఎం నేరుగా చూస్తున్న అత్యంత ప్రాధాన్యత కార్యక్రమమని కలెక్టర్ తెలిపారు.
Similar News
News October 14, 2025
కృష్ణానది నుంచి నేరుగా రక్షిత తాగునీరు: ఎంపీ

జల్జీవన్ పథకం కింద కృష్ణానది నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంటింటికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) తయారు చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాలాజీతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
News October 13, 2025
ఇందిరాగాంధీ స్టేడియంలో కబడ్డీ, వాలీబాల్ జట్ల ఎంపిక

కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-19 కబడ్డీ, వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.
News October 13, 2025
మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్కు 32 అర్జీలు

కృష్ణాజిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి 32 అర్జీలు అందాయి. అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు వివరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన తప్పక పరిష్కార చర్యలు చేపడతామని అర్జీదారులకు తెలియజేశారు. చట్ట పరిధిలో పరిష్కార చర్యలు ఉంటాయన్నారు.