News October 8, 2024

‘పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషి చేయాలి’

image

పార్టీ బలోపేతానికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆ జిల్లాల వైసీపీ అధ్యక్షులు ఎస్సీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలన్నారు. కార్యక్రమంలో ఆలూరు, మంత్రాలయం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Similar News

News October 8, 2024

బీజేపీ నుంచి ఆదోని మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

image

మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్‌‌ను BJP సస్పెండ్ చేసింది. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ షోకాజ్ నోటీసులు జారీ చేయగా రిప్లై ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ తెలిపారు. ప్రకాశ్ 1983లో అదోని నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉండగా సస్పెండ్ చేసింది.

News October 8, 2024

ప్రాణాల మీదకు తెచ్చిన చేపల వేట

image

వెల్దుర్తి మండలం బోగోలుకు చెందిన వెంకటస్వామికి గొంతులో చేప ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. చేపల వేటకు వెళ్లిన అతను చేపను పట్టుకొని నోట్లో పెట్టుకోగా.. పళ్లు లేకపోవడంతో గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో కక్కలేక, మింగలేక అల్లాడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాస్పతికి తరలించారు. గొంతులో ఇరుక్కున్న చేపను వైద్యులు బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

News October 8, 2024

శ్రీశైలంలో సినీ హీరో గోపీచంద్ పూజలు

image

దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రాన్ని సినీ హీరో గోపీచంద్ సందర్శించారు. శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనార్థమై ఆలయం వద్దకు చేరుకున్న గోపీచంద్‌కు అధికారులు ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనలు వళ్లించగా, అధికారులు శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలు, చిత్రపటంతో సత్కరించారు.