News May 12, 2024

పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎస్పీ చందనా దీప్తి

image

NLG:ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.జిల్లాలో శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు,9 మంది డిస్పీలు,37 మంది సీఐలు,84 మంది యస్.ఐలతో కలిపి మొత్తం 3000 మంది సిబ్బంది, 7 కంపెనీల కేంద్ర బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది.వీటితో పాటు 5 ప్లాటున్ల TSSP సిబ్బంది,పెట్రోలింగ్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News February 20, 2025

నల్గొండ జిల్లా టాప్ న్యూస్

image

☞ లింగమంతుల స్వామిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి ☞ దామరచర్ల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి ☞ నల్గొండలో ఘోర రోడ్డుప్రమాదం  ☞ తనపై దాడులు చేస్తున్నారని శాంతమ్మ అనే వృద్ధురాలి ఆవేదన ☞ ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారం ☞ శివాజీ జయంతి.. నల్గొండలో భారీ ర్యాలీ 

News February 19, 2025

దామరచర్ల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. పరిసరాలు, వంటగది, తరగతి గదులు, మరుగు దొడ్లు పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను తనిఖీ చేశారు. నెలలోపు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

News February 19, 2025

ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ BJP: మంత్రి కోమటిరెడ్డి

image

బీజేపీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దురాజ్‌పల్లిలో మాట్లాడుతూ.. ‘ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ.. వాళ్లకు మా గురించి మాట్లాడే అర్హత లేదు, మాది సెక్యులర్ ప్రభుత్వం, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, మాకు అన్ని పండుగలు సమానమే, ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం, వచ్చే 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుంది’ అని మంత్రి అన్నారు.

error: Content is protected !!