News April 24, 2024

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: మంత్రి

image

దేశంలోనే అత్యధికంగా 15 పార్లమెంటు స్థానాలు గెలుచుకునే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం గంగోలు గ్రామంలో గల వీవీఆర్ ఫంక్షన్ హాల్లో మహబూబాబాద్ పార్లమెంట్ భద్రాచలం నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Similar News

News October 20, 2025

ఖమ్మం: విద్యార్థి మృతి.. ఆర్ఎంపీ ఇంటి ముందు ఆందోళన

image

చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి జస్వంత్ ఆర్ఎంపీ వైద్యం వికటించి మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. కొదుమూరులోని ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్న కొద్దిసేపటికే తమ బిడ్డ మృతి చెందాడన్నారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతని ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

News October 19, 2025

ఖమ్మం జిల్లాలో 4,043 దరఖాస్తులు

image

ఖమ్మం జిల్లాలో 116 వైన్స్‌లకు 4,043 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఏకంగా 1,653 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున 121.29 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 122 వైన్స్‌లకు 7200 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 144 కోట్ల ఆదాయం లభిచింది. ఈ నెల 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశముంది.

News October 19, 2025

ఖమ్మం: సీట్ల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం

image

ఖమ్మం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 5 నుంచి 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సోషల్ వెల్ఫేర్ గురుకుల జిల్లా కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 23 సాయంత్రం 5లోగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అంబేద్కర్ కళాశాలలో సంప్రదించాలన్నారు.