News April 18, 2024
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ చందనా దీప్తి

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. సెంట్రల్ ఫోర్స్, అర్ముడ్, సివిల్ ఫోర్స్ తో మూడు అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News October 26, 2025
పత్తిని ఇక్కడ అమ్ముకుంటేనే లాభం: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

జిల్లాలో 23 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, రైతులు దళారులకు తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని నష్టపోవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 5,68,778 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారని.. జిల్లావ్యాప్తంగా 57,23,951 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశామని ఆయన తెలిపారు.
News October 26, 2025
NLG: పాపం పత్తి రైతు.. ఇలాగైతే కష్టమే!

వరుస వర్షాలతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. అకాల వర్షాల కారణంగా పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయి రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం 12 శాతం లోపు తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర వచ్చే నిబంధనలు ఉండడం రైతుకు ఇబ్బందిగా మారింది. జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం తగ్గడం లేదని రైతుల వాపోతున్నారు.
News October 26, 2025
NLG: లక్ ఎవరిని వరిస్తుందో..!

కొత్త మద్యం పాలసీ నిర్వహణకు వేలైంది. ప్రభుత్వం గత నెల 26 నుంచి ఈ నెల 23వరకు మద్యం టెండర్ల దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చాయి. లక్కీడ్రా పద్ధతిలో సోమవారం షాపులు కేటాయించనున్నారు. ఇందుకు నల్గొండలోని లక్ష్మీ గార్డెన్స్లో ఏర్పాట్లు చేస్తుండగా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సంతోష్ పరిశీలించారు.


