News September 27, 2024
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఇద్దరు ఎంపీలకు చోటు

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలకు పార్లమెంట్ స్థాయి సంఘం ఛైర్మన్ పదవులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్లుగా, పలువురిని స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమించింది. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డికి ఇంధనం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవులు దక్కాయి.
Similar News
News November 17, 2025
నల్గొండలో నూతన డిజిటల్ లైబ్రరీ ప్రారంభం

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ ఈ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ బాలమ్మ, గాదే వినోద్ రెడ్డి, ప్రమీల సహా జిల్లా గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
News November 17, 2025
GREAT.. కనగల్ నుంచి నేషనల్ పోటీలకు..

కనగల్ మండలం జి.యడవల్లి హైస్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థిని పి. దీక్షిత అండర్- 17 బాలికల జాతీయ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో దీక్షిత ప్రతిభ కనబరిచింది. ఈనెల 25 నుంచి 29 వరకు కర్ణాటకలోని తుములూరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుందని పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మి, పీడీ నారాయణ కవిత తెలిపారు.
News November 16, 2025
జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం: మంత్రి కోమటిరెడ్డి

సమాజ సమస్యలను ధైర్యంగా ప్రజల ముందుకు తెస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎక్స్పీరియం ఎకో పార్కులో జరిగిన జర్నలిస్టుల కుటుంబాల గెట్-టు-గెదర్లో ఆయన పాల్గొన్నారు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్న మీడియా మిత్రుల పట్ల తనకు గౌరవం, కృతజ్ఞతలు ఉన్నాయని మంత్రి తెలిపారు.


