News May 11, 2024

పార్వతిపురం: నేటితో ప్రచారానికి తెర

image

ఓటింగుకు 48 గంటలు మాత్రమే ఉండడంతో ప్రచార కార్యక్రమాలు శనివారం సాయంత్రం 6 గంటలతో ముగియనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమయం తర్వాత అభ్యర్థులు, వారి పక్షాన ఎవరైనా ప్రచారం చేస్తే నిబంధనలకు విరుద్ధం అవుతుందన్నారు. సాయంత్రం తర్వాత నుంచి ర్యాలీలు, సభలు, సమావేశాలు విందులు, లౌడ్ స్పీకర్లను నిషేధం విధించినట్లు కలెక్టర్ చెప్పారు.

Similar News

News October 16, 2025

లైంగిక వేధింపులకు పాల్పడే వారి భరతం పట్టాలి: VZM SP

image

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారి భరతం పట్టాలని ఎస్పీ దామోదర్ అన్నారు. పోలీస్ కార్యాలయంలో జిల్లా స్థాయి నేర సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, దర్యాప్తు కేసులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

News October 16, 2025

ఉద్యోగుల కోసం రేపు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం: VZM కలెక్టర్

image

ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక గ్రీవెన్స్ కార్య‌క్ర‌మాన్ని శుక్రవారం నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి గురువారం తెలిపారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించవచ్చునని పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా సకాలంలో హాజరు కావాలని కోరారు.

News October 16, 2025

VZM: ఆర్టీసీ సేవల్లో సమస్యలపై తెలయజేయండి

image

ఆర్టీసీ సేవల్లో సమస్యల తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణాధికారిణి జి.వరలక్ష్మి తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫిర్యాదు స్వీకరించనున్నారు. విజయనగరం జిల్లా పరిధిలో గల ప్రయాణికులు, తమ సలహాలు, సూచనలు, సమస్యలపై 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.