News May 11, 2024

పార్వతిపురం: నేటితో ప్రచారానికి తెర

image

ఓటింగుకు 48 గంటలు మాత్రమే ఉండడంతో ప్రచార కార్యక్రమాలు శనివారం సాయంత్రం 6 గంటలతో ముగియనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమయం తర్వాత అభ్యర్థులు, వారి పక్షాన ఎవరైనా ప్రచారం చేస్తే నిబంధనలకు విరుద్ధం అవుతుందన్నారు. సాయంత్రం తర్వాత నుంచి ర్యాలీలు, సభలు, సమావేశాలు విందులు, లౌడ్ స్పీకర్లను నిషేధం విధించినట్లు కలెక్టర్ చెప్పారు.

Similar News

News February 13, 2025

MSP సేవలను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలి: VZM SP

image

క్షేత్ర స్థాయిలో MSPల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. విధి నిర్వహణ పట్ల MSPలకు దిశా నిర్దేశం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో వారి సేవలను మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని కోరారు. ప్రతీ వారం MSPలతో సమావేశాలు నిర్వహించి, క్షేత్ర స్థాయిలో విషయాలను తెలుసుకోవాలన్నారు.

News February 12, 2025

VZM: హత్యకు గురైన MRO భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

image

విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో రమణయ్య గతేడాది ఫిబ్రవరి 2న విశాఖలో హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్‌గా నియామక పత్రం అందించారు.

News February 12, 2025

చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసులు

image

బొబ్బిలి పట్టణంలో వారం రోజుల క్రితం జరిగిన చోరీలో బంగారు ఆభరణాలు, నగదును పోలీసులు రికవరీ చేశారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిందుతులను మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. నగల వ్యాపారి రవి ఇంటిలో ఈనెల 1న చోరీ చేసిన సొత్తును అమ్మేందుకు రాయగడ వెళ్తుండగా 45తులాలను స్వాధీనం చేసుకుని ముగ్గురుని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. ఏ1 ముద్దాయి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

error: Content is protected !!