News March 2, 2025
పార్వతీపురంలో కుప్పలుగా తాగిపడేసిన సారా ప్యాకెట్లు

పార్వతీపురం నడిబొడ్డున గల వరహాలు గడ్డలో కుప్పలుగా తాగిపడేసిన సారా ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం అంటూ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ సారా ప్యాకింగ్కు ప్లాస్టిక్ కవర్లు ఎలా దొరుకుతున్నాయని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరో పక్క, ఎక్సైజ్ అధికారులు సారా నియంత్రణలో భాగంగా నవోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ, సారా విక్రయాలు వారికి సవాల్గా మారాయి.
Similar News
News November 23, 2025
గుంటూరు: CCI పత్తి కొనుగోళ్లు ప్రారంభం

2025–26 సీజన్కు పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్టు CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా శనివారం తెలిపారు. రాష్ట్రంలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. MSP కింద పత్తి అమ్మడానికి Kapas Kisan App ద్వారా స్లాట్బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు. తేమ 8% లోపు ఉంటే పూర్తి MSP, 8–12% మధ్య ఉంటే తగ్గింపులు ఉంటాయని తెలిపారు. సహాయం కోసం WhatsApp హెల్ప్లైన్ 7659954529 అందుబాటులో ఉందన్నారు.
News November 23, 2025
కుజ దోషం అంటే ఏంటి?

ఓ వ్యక్తి జాతక చక్రంలో కుజుడు 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే అతనికి కుజ దోషం ఉన్నట్లు పరిగణిస్తారు. జ్యోతిషం ప్రకారం.. ఈ దోషం ఉన్నవారికి బలమైన కోరికలుంటాయి. ఎప్పుడూ అహం, ఆవేశంతో ఊగిపోతారని, వివాహం ఆలస్యంగా అవుతుందని, వైవాహిక జీవితంలో సమస్యలుంటాయని నమ్ముతారు. అయితే వీటన్నింటికీ జ్యోతిష శాస్త్రంలో పరిహారాలున్నాయని పండితులు చెబుతున్నారు.
☞ వాటి గురించి తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News November 23, 2025
ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు వీరే..!

కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించింది. కాంగ్రెస్ మొత్తం 36 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమాకం చేపట్టింది.
1.మహబూబ్నగర్- సంజీవ్ ముదిరాజ్
2.నాగర్కర్నూల్- చిక్కుడు వంశీకృష్ణ
3.వనపర్తి- కె.శివసేనారెడ్డి
4.జోగుళాంబ గద్వాల్-రాజీవ్ రెడ్డి
5.నారాయణపేట- కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి.
# SHARE IT


