News March 30, 2025

పార్వతీపురంలో నేడు ఈ మండలాలకు అలర్ట్

image

పార్వతీపురం జిల్లాలో నేడు ఈ మండలాల్లో అధిక ఉష్ణగ్రతలు నమోదవుతాయని (APSDMA) అధికారిక ‘x’ ఖాతా ద్వారా ఆదివారం తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పార్వతీపురం 40.6, సీతానగరం 41.0,బలిజిపేట 41.0, కురుపాం 30.9,గరుగుబిల్లి 41.1, గుమ్మలక్ష్మీపురం 40.0, కొమరాడ 40.2,జియమ్మవలస 40.5, సాలూరు 38.7, మక్కువ 39.9, పాచిపెంట 38.4, పాలకొండ 40.2, వీరఘట్టం 40.7, సీతంపేట 39.8, భామిని 40.0 నమోదవుతాయి.

Similar News

News January 3, 2026

పోలవరం: జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు

image

పోలవరం జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వై.రామవరం మండలంలోని డొంకరాయి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ చరణ్ నాయక్ వాహన తనిఖీలు నిర్వహించారు. రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ శివ కుమార్, జడ్డంగి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ చినబాబు వాహన తనిఖీలు చేసి రికార్డులు సక్రమంగా లేనివారికి జరిమానాలు విధించారు.

News January 3, 2026

మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)లో భాగంగా 2025 ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేసే ప్రక్రియ నిర్వహణ వేగవంతం చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 52 శాతమే పూర్తి చేశారని, ప్రక్రియను మరింత వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలన్నారు. 

News January 3, 2026

CBN, లోకేశ్‌ విదేశీ పర్యటనలపై అనుమానాలు: కాకాణి

image

AP: CM CBN, లోకేశ్ రహస్య విదేశీ పర్యటనలపై అనేక సందేహాలు వస్తున్నాయని YCP నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రజల దృష్టి మళ్లించేందుకు రహస్య ప్రదేశాల నుంచి ట్వీట్లు చేస్తున్నారు. పెట్టుబడులపై ఫోర్బ్స్ నివేదిక అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. MOUలతోనే పెట్టుబడులు వచ్చేసినట్లు చెబుతున్నారు’ అని విమర్శించారు. అనుకూల మీడియాకూ వారెక్కడున్నారో తెలియదంటే ఏదో జరుగుతోందన్న అనుమానాలున్నాయని చెప్పారు.