News March 18, 2025

పార్వతీపురంలో పీజిఆర్ఎస్‌కు 121 వినతులు

image

వినతుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. 121 మంది అర్జీదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు.

Similar News

News November 23, 2025

SRD: తీవ్ర విషాదం.. బిడ్డ మృతి తల్లి సూసైడ్

image

జహీరాబాద్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బిడ్డ మరణం జీర్ణించుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. మండలంలోని ఎల్గోయికి చెందిన ఐషు(3) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందింది. బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపం చెందిన తల్లి లావణ్య(23) శనివారం సాయంత్రం అంత్యక్రియల అనంతరం ఆత్మహత్య చేసుకుంది. గంటల వ్యవధిలో తల్లి, కుమార్తె మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 23, 2025

కోనసీమ కష్టాలకు పవన్ ‘బ్రేక్’ వేస్తారా?

image

కోనసీమ కొబ్బరి రైతులు కన్నీరు పెడుతున్నారు. మలికిపురం ప్రాంతంలో ఒకవైపు తెగుళ్లు, మరోవైపు ఆక్వా సాగుతో పెరిగిన ఉప్పునీటి ప్రభావం కారణంగా పచ్చని కొబ్బరి చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. తోటలు నాశనమవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు 26న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించనున్నారు. పవన్ తమ సమస్యలు పరిష్కరిస్తారని రైతులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.

News November 23, 2025

రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గ్లోబల్ సమ్మిట్‌

image

DEC 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో TG ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు 2వేల మంది ప్రముఖులు రానున్నారు. రాష్ట్ర లక్ష్యాలు, ప్రణాళికలు వివరించేలా ప్రభుత్వం ‘TG రైజింగ్-2047’ డాక్యుమెంట్‌ను రూపొందించి ఆవిష్కరించనుంది. ఈ నెల 25 నుంచి CM రేవంత్ వివిధ శాఖలతో సమీక్షించి డాక్యుమెంట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచడం, భారీగా పెట్టుబడులను ఆకర్షించడం దీని లక్ష్యం.