News March 18, 2025
పార్వతీపురంలో పీజిఆర్ఎస్కు 121 వినతులు

వినతుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. 121 మంది అర్జీదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు.
Similar News
News November 10, 2025
విజయనగరం కలెక్టర్ ఆఫీసుకి 178 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 178 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిలో 63 రెవెన్యూ, 29 డీఆర్డీఏ, 20 GSW విభాగాలకు సంబంధించినవని తెలిపారు. ప్రతి దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని, పరిష్కారామయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు.
News November 10, 2025
గణాంక ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో 7వ చిన్న నీటిపారుదల గణాంక వివరాల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సహజ, మానవ నిర్మిత బోరుబావులు, చెరువులు, కుంటలు, కాలువలు తదితర చిన్న నీటిపారుదల వివరాలన్నింటినీ సమగ్రంగా సేకరించాలని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన సూచించారు.
News November 10, 2025
రాజమండ్రి: ‘ఇప్పుడు ఇంటి పన్ను కట్టడం నిమిషాల్లో పని’

జిల్లా ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం రూపొందించిన ‘స్వర్ణ పంచాయతీ’ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ‘ఇంటి పన్ను చెల్లింపుల అవగాహన పోస్టర్’ ఆవిష్కరణ జరిగింది. ఈ కొత్త విధానం ద్వారా కేవలం ఫోన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇంటి పన్నులు సులభంగా చెల్లించవచ్చునన్నారు.


