News March 18, 2025
పార్వతీపురంలో పీజిఆర్ఎస్కు 121 వినతులు

వినతుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. 121 మంది అర్జీదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు.
Similar News
News October 27, 2025
ASF: ‘పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి’

తుపాను వలన అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ASF జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
News October 27, 2025
‘మనీవ్యూ’కు సైబర్ షాక్.. 3 గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టారు

రుణాలిచ్చే మనీవ్యూ యాప్కు సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. యాప్ సిస్టమ్లోకి చొరబడి 3గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టారు. 653 ఫేక్ అకౌంట్లకు డబ్బును బదిలీ చేసుకున్నారు. దుబాయ్, చైనా, హాంగ్కాంగ్, ఫిలిప్పీన్స్ నుంచి అంతర్జాతీయ ముఠా ఈ దాడి చేసిందని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. దుబాయ్లోని భారత సంతతి వ్యక్తి సూత్రధారి అని చెప్పింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, ₹10 కోట్లు ఫ్రీజ్ చేశారు.
News October 27, 2025
ASF: ‘రైలులో వదిలిపెట్టిన పసిపాపను రక్షించిన అధికారులు’

సికింద్రాబాద్ నుంచి పాట్నాకు వెళ్తున్న దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో గుర్తు తెలియని తల్లి సుమారు 2 నెలల పసిపాపను వదిలి వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం గురించి ASF జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్కి సమాచారం అందించారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది పాపను బాల రక్షా భవన్, ఆసిఫాబాద్కి తరలించారు. జిల్లా సంక్షేమ అధికారి డా.భాస్కర్ ఆదేశాల మేరకు ఆ పాపను ADBలోని శిశు గృహానికి తరలించారు.


