News January 26, 2025
పార్వతీపురంలో ప్రత్యేక ఆకర్షణగా శకటాలు

పార్వతీపురంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపికైన పాఠశాల విద్య, ఇంజినీరింగ్ శాఖ, ఏపీఈపీడీసీఎల్ శకటాలకు బహుమతులు వరించాయి. శకటాలు ఏర్పాటు చేసిన వారందరినీ కలెక్టర్ అభినందించారు.
Similar News
News March 14, 2025
ఏప్రిల్ 9 నుంచి 1-9వ తరగతి ఎగ్జామ్స్

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్మెంట్-2) ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న పరీక్షలు ముగుస్తాయని, అనంతరం జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి అదే నెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.
News March 14, 2025
అమెరికన్ NRIs బీకేర్ఫుల్… లేదంటే!

అమెరికాలో NRIలు జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మాస్ డీపోర్టేషన్ కోసం వార్టైమ్ ఏలియన్స్ చట్టాన్ని ట్రంప్ ప్రతిపాదిస్తుండటం, గ్రీన్కార్డు హోల్డర్స్ శాశ్వత నివాసులు కాదని VP JD వాన్స్ చెప్పడాన్ని వారు ఉదహరిస్తున్నారు. లీగల్గా అక్కడికి వెళ్లినా తొలి ప్రాధాన్యం వైట్స్కేనని అంటున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోకుంటే తరిమేస్తామన్న ట్రంప్ పాలకవర్గం మాటల్ని గుర్తుచేస్తున్నారు. COMMENT.
News March 14, 2025
మేడ్చల్ పోలీసు క్రికెట్ లీగ్ టోర్నీ

మేడ్చల్ పోలీసు క్రికెట్ లీగ్ టోర్నీలో భాగంగా పోలీసు బృందం విజయం సాధించింది. పోలీసులకు, జర్నలిస్టులకు జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచిన పోలీసు బృందం మొదట బ్యాటింగ్ చేసి 69 రన్స్ చేసింది. 69 రన్స్కు గానూ జర్నలిస్టు బృందం 67 రన్లు తీసి రన్నర్గా నిలిచింది. రెండు రన్ల తేడాతో పోలీస్ టీం విజయం సాధించింది. కాగా మాన్ అఫ్ ది మ్యాచ్ విలేఖరి రాజశేఖర్కు దక్కింది.