News March 20, 2024

పార్వతీపురంలో బీటెక్ విద్యార్థి సూసైడ్

image

పార్వతీపురం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. కుసుమగుడి వీధికి చెందిన కల్లూరి తారకేశ్వరరావు(20) బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చదువులో రాణించలేకపోతున్నా అనే కారణంతో మనస్థాపం చెంది బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడన్నారు. ఈ మేరకు పట్టణ ఎస్సై సంతోషి కుమారి వివరాలను నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Similar News

News February 15, 2025

వారిని కచ్చితంగా శిక్షించాలి: SP వకుల్ జిందాల్

image

NDPS((నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కేసుల్లో నిందితులు కచ్చితంగా శిక్షించాలిలని SP వకుల్ జిందాల్ అన్నారు. విశాఖ డిఐజి గోపీనాథ్ జెట్టి ఆదేశాలతో దర్యాప్తులో మెలకువలు నేర్పేందుకు శనివారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. NDPS చట్టం చాలా కఠినమైనదని, చట్టంలో పొందుపరిచిన విధివిధానాలను దర్యాప్తు అధికారులు పాటిస్తే నిందితులు తప్పనిసరిగా శిక్షింపబడతారన్నారు.

News February 15, 2025

విశాఖ: కామాంధుడి కోరికలకు వివాహిత బలి

image

గోపాలపట్నంలో శుక్రవారం జరిగిన వివాహిత ఆత్మహత్య ఘటన కలిచివేసింది. తన వికృత చేష్టలతో భార్యను దారుణంగా హింసించిన భర్త.. చివరకు ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. పోర్న్ వీడియోలకు బానిసై భార్యతో మానవ మృగంలా ప్రవర్తించాడు. లైంగిక వాంఛకు ప్రేరేపించే మాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. మానసికంగా ఎంతో వేదనను అనుభవించిన ఆమె చివరకు ఉరి వేసుకుని తన జీవితానికి ముగింపు పలికింది

News February 14, 2025

VZM: గ్రూప్-2 పరీక్షకు 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

image

APPSC ఆధ్వ‌ర్యంలో ఈ నెల 23న గ్రూప్‌-2 మెయిన్స్ ప‌రీక్ష‌లు జరగనున్నాయి. విజ‌య‌న‌గ‌రంలో మొత్తం 12 ప‌రీక్షా కేంద్రాల‌ను అధికారులు ఏర్పాటు చేశామని జేసీ సేతు మాధవన్ తెలిపారు. ఆ రోజు ఉద‌యం 10 నుంచి 12.30 వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 నుంచి 5.30 వ‌ర‌కు ప‌రీక్షలు జ‌రుగుతాయి. ప‌రీక్షా కేంద్రం వ‌ద్ద 144 సెక్ష‌న్ ఏర్పాటు చేయాల‌ని, ప‌టిష్ఠమైన పోలీసు బందోబ‌స్తు నిర్వ‌హించాల‌ని జేసీ అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!