News March 1, 2025

పార్వతీపురంలో మెుదలైన పింఛన్ల పంపిణీ

image

పార్వతీపురం మన్యం జిల్లాలో మార్చి నెల పింఛన్ల పంపిణీ ప్రక్రియ మొదలైంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు. ఈ నెల నుంచి ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీని చేపడుతున్నారు. కాగా జిల్లాలో 1.48 లక్షల మంది పెన్షన్ దారులున్నారు. వీరందరికీ రూ.59 కోట్ల మేర పంపిణీ చేయాల్సి ఉంది.

Similar News

News February 26, 2026

సునీల్ నాయక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ

image

AP: బిహార్ క్యాడర్ IPS సునీల్ నాయక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. Dy.స్పీకర్ RRRపై YCP ప్రభుత్వ హయాంలో CID కస్టడీలో హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో గుంటూరు మొబైల్ కోర్టు ఈ వారెంట్‌ను ఇష్యూ చేసింది. పోలీసుల నోటీసులపై సునీల్ స్పందించకపోవడంతో ఇటీవల ఎస్పీ దామోదర్ బృందం బిహార్ వెళ్లగా అక్కడి హైకోర్టు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయలేదు. దీంతో GNT మొబైల్ కోర్టులో అరెస్ట్ వారెంట్ పిటిషన్ వేశారు.

News February 26, 2026

కోళ్లలో రక్తపారుడు వ్యాధిని ఎలా గుర్తించాలి?

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.

News February 26, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>RITES<<>> లిమిటెడ్‌ 9 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, పీజీ (సివిల్ ఇంజినీరింగ్), ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. మార్చి 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rites.com