News January 30, 2025
పార్వతీపురం అదనపు ఎస్పీగా ఎల్.నాగేశ్వరి

పార్వతీపురం అదనపు ఎస్పీగా ఎల్.నాగేశ్వరీ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు అదనపు ఎస్పీగా విధులు నిర్వహించిన డాక్టర్ దిలీప్ కిరణ్ ఏసీబీకి బదిలీపై వెళ్లనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన నుంచి నేటి వరకు అదనపు ఎస్పీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.
Similar News
News March 1, 2026
దేవాలయాల పాలకవర్గాలకు నోటిఫికేషన్

దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న NKP, CTL మండలాల్లోని పలు దేవాలయాలకు పాలకవర్గాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించారు. NKP మండలంలో NKP ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి, రామలింగేశ్వరస్వామి, ఎం.ఎడవెల్లిలోని హనుమాన్, షాపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి, మాండ్రలోని శ్రీ ఆంజనేయస్వామి CTL మండలం పేరుపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయ పాలకవర్గాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది.
News March 1, 2026
జగిత్యాల: నేడే ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష

జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్లో అందించే ఐదు నెలల ఉచిత శిక్షణ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ నరేశ్ తెలిపారు. ఈరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జగిత్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ & పీజీ కాలేజీలో ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్, ఆధార్ కార్డు, బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో హాజరుకావాలని సూచించారు.
News March 1, 2026
ములుగు: CG మావోయిస్టుల డంప్ స్వాధీనం

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో పోలీసులకు భారీ విజయంలభించింది. నక్సలైట్లు రెండు వేర్వేరు ప్రదేశాల్లో దాచిన డంప్లపై శనివారం దాడులు నిర్వహించి రూ.46,31,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండో డంప్లో భారీ ఆయుధాలు, కార్ట్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ సామగ్రి పట్టుబడ్డాయి. ఇప్పటివరకు భద్రతా దళాలు మొత్తం రూ.1.08 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.


