News March 12, 2025

పార్వతీపురం: అప్పారావు కుటుంబం ఆచూకీ లభ్యం

image

తమిళనాడులో 20 ఏళ్లుగా చిక్కుకున్న అప్పారావు కుటుంబం ఆచూకీ లభ్యమైనట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో గల బంధుగాం బ్లాక్ చినవల్లాడకి చెందిన వ్యక్తిగా తెలిపారు. ఆయన కుమార్తె దుంబుదొర సాయమ్మ, అల్లుడు చందు పార్వతీపురం మండలం మునక్కాయవలసలో నివసిస్తున్నారని తెలిపారు. తమిళనాడు కలెక్టర్‌తో మాట్లాడి అప్పారావును తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.

Similar News

News November 5, 2025

MDK: ఆందోళనకు గురి చేస్తున్న ఆత్మహత్యలు

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఇటీవల యువకుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 25 ఏళ్ల వయసులోపు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట గ్రామంలో మూడు నెలల వ్యవధిలో ముగ్గురు యువకులు వివిధ కారణాలతో క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారులు స్పందించి యువకులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

News November 5, 2025

PNBలో 750 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 750 పోస్టులకు 20-30 ఏళ్ల మధ్య ఉన్న గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ నవంబర్ 23. ఇక్కడ <>క్లిక్<<>> చేసి నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు.

News November 5, 2025

కరీంనగర్: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

KNR జిల్లా తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీలో పురుషుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాలున్న పురుషులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు Nov9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు తమను సంప్రదించవచ్చన్నారు. SHARE IT.