News March 12, 2025

పార్వతీపురం: అప్పారావు కుటుంబం ఆచూకీ లభ్యం

image

తమిళనాడులో 20 ఏళ్లుగా చిక్కుకున్న అప్పారావు కుటుంబం ఆచూకీ లభ్యమైనట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో గల బంధుగాం బ్లాక్ చినవల్లాడకి చెందిన వ్యక్తిగా తెలిపారు. ఆయన కుమార్తె దుంబుదొర సాయమ్మ, అల్లుడు చందు పార్వతీపురం మండలం మునక్కాయవలసలో నివసిస్తున్నారని తెలిపారు. తమిళనాడు కలెక్టర్‌తో మాట్లాడి అప్పారావును తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.

Similar News

News December 5, 2025

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ఇవ్వండి: కలెక్టర్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ శుక్రవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ నిధికి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు విరివిగా విరాళాలు అందజేయాలని కోరారు. గోడపత్రికపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ సులభంగా విరాళాలను జమ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News December 5, 2025

కోతులను పట్టిస్తేనే.. సర్పంచ్‌గా గెలిపిస్తాం: మాదారం గ్రామస్థులు

image

భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలోని మాదారం గ్రామ ప్రజలు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా మారి, పంటలను నాశనం చేస్తుండటంతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు కోతుల సమస్యను పరిష్కరించే అభ్యర్థినే తాము గెలిపిస్తామని గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు స్పష్టం చేశారు.

News December 5, 2025

RR: ఎన్నికలకు ఎంత ఖర్చు చేయాలంటే!

image

కొత్తూరు MPDO కార్యాలయంలో ఎన్నికల అధికారులు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు.
☛సర్పంచ్ అభ్యర్థి గరిష్ఠంగా ₹1,50,000 మాత్రమే ఖర్చు చేయాలి
☛వార్డు మెంబర్ ₹50,000 మించరాదు
☛బ్యాంకు/ UPI ద్వారానే చెల్లించాలి
☛రోజువారీగా ఖర్చుల రికార్డు, రసీదులు తప్పనిసరి
☛లిమిట్ దాటితే అభ్యర్థిత్వం రద్దు
ఖర్చులన్నీ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేస్తుందని నియమాలు తప్పక పాటించాలని అధికారులు సూచించారు.