News February 18, 2025
పార్వతీపురం: ఆమె రాకతోనైనా సమస్య తీరనుందా?

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏళ్ల తరబడి ఏనుగుల సమస్య పట్టిపీడుస్తోంది. పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో 7 ఏనుగులు ఉండగా, పాలకొండ నియోజకర్గంలో 4 ఏనుగులు సంచరిస్తున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, వందల ఎకరాల్లో పంటలను ఏనుగులు పాడుచేశాయి. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర ముఖ్య అటవీ శాఖ కన్జర్వేటర్ శాంతిప్రియ మంగళవారం(నేడు) పర్యటించనున్నారు. ఆమె పర్యటనతోనైనా ఈ సమస్యకు చెక్ పడుతుందేమో చూడాలి.
Similar News
News October 25, 2025
బస్సు యాక్సిడెంట్: హైదరాబాద్ కలెక్టరేట్లో హెల్ప్లైన్

కర్నూలు(D) చిన్నటేకూరు వద్ద నిన్న తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ స్లీపర్ బస్సులో జరిగిన అగ్నిప్రమాద ఘటన విదితమే. ఇందులో మృతి చెందిన, చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబాలకు సహాయం అందించేందుకు HYD కలెక్టరేట్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
నర్సయ్య, సూపరింటెండెంట్–వాట్సాప్ నం: 9063423950
సంగీత, కంట్రోల్ రూమ్: నం: 9063423979కు ఫోన్ చేయాలన్నారు.
News October 25, 2025
అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్లో ఆధార్ లింక్ చేయాలని డెడ్లైన్ విధించింది. ఆధార్తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.
News October 25, 2025
మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.


