News April 13, 2025
పార్వతీపురం: ఇంటర్ ఫలితాల్లో గిరి విద్యార్థుల ప్రతిభ

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు DIEO మంజుల వీణ తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 947 మంది పరీక్షలు రాసి 920 ఉత్తీర్ణత సాధించగా 97.1 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 941 మంది పరీక్షలు రాసి 930 ఉత్తీర్ణత సాధించి 98.8 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు వివరాలు వెల్లడించారు.
Similar News
News February 27, 2026
హుజూర్నగర్: 22,500 కోట్లతో ఇండ్ల పథకం: మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.22,500 కోట్లతో 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం రామస్వామి వద్ద రూ.125 కోట్లతో నిర్మిస్తున్న 2,160 ఇండ్ల పెండింగ్ పనులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్తో కలిసి పరిశీలించారు. ప్రతి బ్లాక్లో మౌలిక వసతుల పురోగతిని సమీక్షించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 27, 2026
రెంటచింతలలో వివాహిత ఆత్మహత్య

రెంటచింతల మండలం మంచికల్లులో కుటుంబ కలహాల నేపథ్యంలో బంకూరి మల్లేశ్వరి (35) అనే వివాహిత గురువారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టి, ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
News February 27, 2026
బెజ్జంకి: సర్పంచులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమం

ఈనెల 23 నుంచి 27 వరకు సిద్దిపేటలో ఐదు రోజులపాటు సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బెజ్జంకి, జగదేవ్పూర్, వర్గల్, నంగునూరు మండలాలకు చెందిన 101 మంది సర్పంచులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, చెట్ల పెంపకం, వీధి దీపాల ఏర్పాటు, అభివృద్ధి పనుల నిర్వహణ వంటి అంశాలపై రిసోర్స్ పర్సన్లు రామకృష్ణారెడ్డి, సమ్మిరెడ్డి, మల్లికార్జున్, శ్రీనివాసరావు, చెన్నారెడ్డి, శ్రీనివాస్ శిక్షణ అందించారు.


