News April 9, 2025
పార్వతీపురం: ఈనెల 14న అంబేడ్కర్ జయంతి

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 14న బీఆర్.అంబేడ్కర్ జయంతిని నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్, మెయిన్ రోడ్డు వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులు అర్పిస్తారని తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో సమావేశం జరుగుతుందని చెప్పారు.
Similar News
News April 20, 2025
రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారని MBNR కలెక్టర్ ఆగ్రహం

ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారా అంటూ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండీడ్ మండలం వెన్నచేడు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. వేసవిలో కేంద్రాలకు వచ్చే రైతులకు నీడ, తాగునీరైనా కల్పించరా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
News April 20, 2025
కాంగ్రెస్ది చేతకాని పాలనకు నిదర్శనం: శ్రీనివాస్ గౌడ్

మద్యం ధరలను పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పరిశ్రమలు ఏర్పాటుచేసి పెట్టుబడులు రాబట్టాలి గాని మద్యం రేట్లు పెంచి ఆదాయాన్ని అర్జించాలనే ప్రభుత్వ ధోరణి చేతకాని పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు.
News April 20, 2025
ఉర్కొండ: వివాహితపై అత్యాచారం.. సీన్ రీ కన్స్ట్రక్షన్

ఉర్కొండ మండలంలో మార్చి 29న పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో జరిగిన వివాహిత అత్యాచారం కేసులో డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రెండో రోజు సీను రీ కన్స్ట్రక్షన్ చేశారు. అత్యాచార సమయంలో నిందితులు ఉపయోగించిన వస్తువులను వారి ఇంటి వద్దకు వెళ్లి సేకరించారు. నిందితుల నుంచి వాహనం, కొంత డబ్బు, వారి వ్యక్తిగత వస్తువులను సీజ్ చేశామని డీఎస్పీ పేర్కొన్నారు.