News November 19, 2024
పార్వతీపురం: ఈనెల 25 వరకు అవకాశం

సార్వత్రిక విద్యాపీఠం 2024-25 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు ఈనెల 25 చివరి తేదీ అని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.టి నాయుడు తెలిపారు. అపరాధ రుసుము రూ. 600తో ప్రవేశం పొందవచ్చని అన్నారు. ఆన్లైన్లో www.apopenschool.ap.gov.in/ap అపరాధ రుసుము చెల్లించి ప్రవేశాలు పొందాలని సూచించారు. >Share it
Similar News
News December 9, 2025
VZM: ‘వచ్చే ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి’

రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల ఇళ్ల నిర్మాణం పురోగతిని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్ బాబు మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. గొల్లలపేట (PMAY-1.0)లో నిర్మిస్తున్న 106 ఇళ్లను సందర్శించి, లబ్ధిదారుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ ఇళ్లను ఉగాది 2026 నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
News December 9, 2025
VZM: మహిళల కోసం ‘వన్ స్టాప్ హెల్ప్ లైన్’ వాహనం

విజయనగరం కలెక్టరేట్లో మహిళల అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన ‘వన్ స్టాప్ హెల్ప్ లైన్’ వాహనాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా హింసకు గురైన మహిళలకు వైద్య, పోలీస్, చట్ట సహాయం, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను ఒకే చోట అందించనున్నట్లు తెలిపారు. 24/7 పనిచేసే ఈ వాహనాలు టోల్ ఫ్రీ నంబర్ 181 ద్వారా మహిళలకు అందుబాటులో ఉంటాయన్నారు.
News December 9, 2025
VZM: జీజీహెచ్ సేవల మెరుగుదలపై అధికారుల సమీక్ష

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జీజీహెచ్ అభివృద్ధి సొసైటీ సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, MLA పూసపాటి అదితి విజయలక్ష్మి పాల్గొని ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల రద్దీ, అవసరమైన మౌలిక వసతులు, పరికరాల అప్గ్రేడేషన్, శుభ్రత, వైద్యసిబ్బంది బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ఇతర వైద్య అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.


