News August 9, 2024

పార్వతీపురం: ఈ నెల 11 నుంచి రైళ్ల పునరుద్ధరణ

image

విశాఖ నుంచి నడిపే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. ఈ నెల 11వ తేదీ నుంచి సింహాద్రి, రత్నాచల్, ఉదయ్, గుంటూరు-రాయగడ, విశాఖ- తిరుపతి డబుల్ డెక్కర్, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్ధరించనున్నారు. 50 రోజులుగా ఈ రైళ్లను నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని పరిశీలించిన రైల్వే అధికారులు ఈ రైళ్లను పునరుద్ధరించాలని నిర్ణయించారు.

Similar News

News October 26, 2025

మూడు జిల్లాల కలెక్టర్లకు మంత్రి కొండపల్లి ఫోన్

image

మోంథా తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, గాలులు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఫోన్ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. తుఫాను ప్రభావం కారణంగా ఏ పరిస్థితి వచ్చినా.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 26, 2025

విజయనగరం జిల్లా రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు

image

విజయనగరం జిల్లాలో మొత్తం 1,04,828 హెక్టార్లలో వరి సాగు జరిగిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. పంటలు పాలుపోసే దశ నుండి కోత దశ వరకు వివిధ దశల్లో ఉన్నాయని, వర్షాల నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. పొలాల్లో నీరు చేరితే బయటకు పంపే చర్యలు తీసుకోవాలన్నారు. కోతకు ముందు వర్షం వస్తే వరి వెన్నులపై లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపిన ద్రావణంతో పిచికారీ చేయాలన్నారు.

News October 26, 2025

రైతులను అప్రమత్తం చేయండి: కలెక్టర్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వరి పంటకు నష్టం జరగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం సూచించారు. వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశముందని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.