News April 7, 2024

పార్వతీపురం: ఈ నెల 20న ఈఎంఆర్ఎస్ ప్రవేశపరీక్ష

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష వాయిదా పడినట్లు ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ తెలిపారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 13న పరీక్ష జరగాల్సి ఉంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్-2 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈనెల 20కు పరీక్ష వాయిదా వేసినట్లు తెలిపారు.

Similar News

News February 22, 2026

VZM: పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

image

పెళ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం (D) సంతకవిటి (M) పోతురాజుపేటకి చెందిన ఐ.దివ్య (22)కి మార్చి 7న వివాహం నిశ్చయించారు. అయితే యువతి ఈనెల 20న గడ్డిమందు తాగింది. వెంటనే రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం శ్రీకాకుళం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 21న మృతి చెందింది. పెళ్లి ఇష్టం లేకనే దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

News February 22, 2026

బొబ్బిలి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

image

బొబ్బిలి పట్టణం కుమ్మరివీధిలో ఉంటున్న మర్రి మాధవిదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. మాధవి చైతన్య పాఠశాలలో గణితం టీచర్‌గా పని చేస్తున్నారు. కొంతకాలంగా ఆమెను భర్త నరేశ్ అనుమానంతో వేధిస్తున్నాడు. నీవు చనిపోతేనే దరిద్రం పోతుందని పదే పదే అనడంతో మనస్తాపానికి గురైన మాధవి శనివారం రాత్రి ఉరివేసుకుందని ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు CI నారాయణరావు చెప్పారు.

News February 22, 2026

VZM: బిల్లులు ఎప్పుడు?

image

విజయనగరం జిల్లాలో పెండింగ్‌ గృహ బిల్లుల సమస్యపై లబ్ధిదారుల్లో అసంతృప్తి పెరుగుతోంది. గతంలో మంజూరైన ఇళ్లకు చెల్లింపులు జరగక అనేక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. 2024లో సర్వే నిర్వహించి 24,000 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సుమారు రూ.19 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. బిల్లులు విడుదలైతే ఇళ్లను పూర్తిచేసుకునేందుకు లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.