News March 28, 2025

పార్వతీపురం: ఉపాధి హామీ పథకం కింద 117 సాగునీటి పనులు

image

ఉపాధి హామీ పథకం కింద 117 సాగునీటి వసతులలో పూడికలు తీసే అవకాశం ఉందని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. 331 ప్రహారీ గోడలను మంజూరు చేయగా 317 పనులు ప్రారంభం అయ్యాయని, మిగిలిన పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. వంద ఎకరాలకు మించి ఆయకట్టు ఉన్న చెరువులలో చేపల పెంపకానికి పనులు చేపట్టాలన్నారు. పంట గుంతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

Similar News

News November 13, 2025

బ్లాస్ట్ చేసిన వారికే కాంగ్రెస్ సపోర్ట్: బీజేపీ

image

ఢిల్లీ బ్లాస్ట్ కారకులకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోందని BJP మండిపడింది. ఎన్నికల సమయంలోనే ఉగ్రవాద దాడులు జరగడానికి కారణమేంటని సిద్దరామయ్య ప్రశ్నించడంపై ఫైర్ అయింది. సిద్దరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, వారివి దిగజారుడు రాజకీయాలని BJP కర్ణాటక చీఫ్ విజయేంద్ర మండిపడ్డారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు.

News November 13, 2025

SC, ST యువతకు ఉచితంగా సివిల్స్ కోచింగ్: మంత్రి

image

AP: ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా UPSC సివిల్స్ శిక్షణ ఇస్తామని మంత్రి DBV స్వామి తెలిపారు. రాష్ట్రంలోని 340 మందికి విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లోని అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో ఫ్రీగా ప్రిలిమ్స్ శిక్షణ అందిస్తామన్నారు. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 13 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. సైట్ https://apstudycircle.apcfss.in

News November 13, 2025

అధికారికంగా జూబ్లీహిల్స్‌లో 48.49% ఓటింగ్

image

జూబ్లీహల్స్ బైపోల్ వివరాలు అధికారికంగా వెల్లిడించారు. మొత్తం 4,01,365 మంది ఓటర్లలో పురుషులు 2,08,561 మంది ఉండగావారిలో 99,771 మంది, మహిళలు 1,92,779 మంది ఉండగా 94,855 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతరులు 25 మంది ఉండగా ఐదుగురు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తంగా 1,94,631 మంది ఓటేశారని అధికారికంగా గణాకాంలు ఇవాళ విడుదల అయ్యాయి. 48.49%తో అతి తక్కువ ఓటింగ్ మనవద్దే నమోదు కావడం గమనార్హం.