News March 28, 2025

పార్వతీపురం: ఉపాధి హామీ పథకం కింద 117 సాగునీటి పనులు

image

ఉపాధి హామీ పథకం కింద 117 సాగునీటి వసతులలో పూడికలు తీసే అవకాశం ఉందని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. 331 ప్రహారీ గోడలను మంజూరు చేయగా 317 పనులు ప్రారంభం అయ్యాయని, మిగిలిన పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. వంద ఎకరాలకు మించి ఆయకట్టు ఉన్న చెరువులలో చేపల పెంపకానికి పనులు చేపట్టాలన్నారు. పంట గుంతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

Similar News

News December 5, 2025

కోదాడ: భర్త వార్డు సభ్యుడిగా.. భార్య సర్పంచ్‌గా పోటీ..!

image

కోదాడ పరిధి అనంతగిరి మండలం అమినాబాద్‌లో భార్యాభర్తలు ఇద్దరూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. భర్త చిలకమూడి శ్రీనివాసరావు వార్డు సభ్యుడిగా పోటీలో ఉండగా సర్పంచ్ స్థానం మహిళకు రిజర్వ్డ్ కావడంతో ఆయన భార్య సంధ్యారాణిని బరిలో నిలిపారు. కాగా వారికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోంది. శ్రీనివాసరావు గతంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. దంపతులు ఇరువురు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News December 5, 2025

కేఎల్‌యూలో నేడు ‘ఉద్భవ్-2025’ ముగింపు సంబరాలు

image

వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయ ఏకలవ్య సాంస్కృతిక ఉత్సవాలు ‘ఉద్భవ్-2025’ నేటితో ముగియనున్నాయి. గిరిజన సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ముగింపు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి అతిథులుగా హాజరవుతారు. గిరిజన విద్యార్థుల కళా ప్రదర్శనల అనంతరం, చేతులకు బహుమతులు అందించనున్నారు.

News December 5, 2025

నల్గొండ: ఏపీ సీఎంను కలువనున్న మంత్రి కోమటిరెడ్డి

image

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలవనున్నారు. అమరావతి, క్యాంపు కార్యాలయంలో బాబును కలిసి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8, 9వ తేదీల్లో నిర్వహించ తలపెట్టిన రైసింగ్ తెలంగాణ-విజన్ 2047, గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఆహ్వానించనున్నారు.