News February 23, 2025

పార్వతీపురం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 2,333 మంది 

image

పార్వతీపురం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2,333 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. అత్యధికంగా పార్వతీపురంలో 636 మంది, అత్యల్పంగా పాచిపెంటలో 34 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు 18 మంది POలు, 18 APOలు, 36 OPOలు, 18 మంది ఎంఓలను నియమించినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 23, 2026

నిర్మల్: అంగన్వాడీలకు విద్యుత్ సౌకర్యం

image

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా 381 కేంద్రాలకు గాను ఇప్పటికే 290 కేంద్రాల్లో మీటర్లు అమర్చారు. మిగిలిన 91 కేంద్రాల్లో త్వరలోనే పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో చిన్నారులకు, గర్భిణులకు మెరుగైన వసతులు లభించనున్నాయి. చీకటి కష్టాలు తొలగి అంగన్వాడీలు వెలుగులతో కళకళలాడనున్నాయి.

News February 23, 2026

రోజూ గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలకు చెక్!

image

గుమ్మడి గింజల్లో ప్రొటీన్స్, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ 30 గ్రాములు తింటే టైప్-2 డయాబెటిస్, హైబీపీ, సంతాన సమస్యలు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, PCOS, థైరాయిడ్, ఊబకాయం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా అవుతాయి. కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది. మంచి నిద్ర పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

News February 23, 2026

నిజామాబాద్: కానిస్టేబుల్ సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం

image

గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె తమ్ముడు గాజుల శ్రవణ్‌కు ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ నియామక పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అందజేశారు. ​ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సౌమ్య కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా అందజేశారు. మాట ఇచ్చిన నెల రోజుల్లోపే ఉద్యోగం, ఆర్థిక సాయం అందించారు.