News February 24, 2025
పార్వతీపురం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం

పార్వతీపురం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2,333 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. అందులో పురుషులు 1574, మహిళలు 759 మంది. అత్యధికంగా పార్వతీపురంలో 636, సాలూరులో 250 మంది ఉన్నారు. అత్యల్పంగా పాచిపెంటలో 34 మంది ఉన్నారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు 18 మంది POలు, 18 APOలు, 36 OPOలు, 18 మంది ఎంఓలను నియమించినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News November 24, 2025
కొహీర్: జీపీవో రాష్ట్ర కార్యదర్శిగా మల్లీశ్వరి

కొహీర్ మండల కేంద్రంలో జీపీవోగా పనిచేస్తున్న నీరుడి మల్లీశ్వరి రాష్ట్ర స్థాయి కీలక పదవికి ఎంపికయ్యారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జీపీవో రాష్ట్ర సదస్సులో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర జీపీవో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి మల్లీశ్వరి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
News November 24, 2025
ఏలూరు: గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి

జీలుగుమిల్లి (M)కామయ్యపాలెం సమీపంలో వాగులో స్నానానికి దిగి తెలంగాణలోని అశ్వారావుపేటకు చెందిన బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. స్నేహితులతో వాగులో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థి యశ్వంత్ (15) ఈత రాక మునిగి మృతి చెందగా.. మనుమడి మరణవార్త విని తట్టుకోలేక నాయనమ్మ వెంకమ్మ (65) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో దొంతికుంట గ్రామంలో విషాదం అలుముకుంది.
News November 24, 2025
NLG: ‘TCC పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి’

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఎగ్జామ్, లోయర్ అండ్ హయ్యర్ డ్రాయింగ్ అండ్ టైలరింగ్ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.bse.telangana.gov.in ను చూడాలన్నారు. .


