News February 24, 2025

పార్వతీపురం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం

image

పార్వతీపురం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2,333 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. అందులో పురుషులు 1574, మహిళలు 759 మంది. అత్యధికంగా పార్వతీపురంలో 636, సాలూరులో 250 మంది ఉన్నారు. అత్యల్పంగా పాచిపెంటలో 34 మంది ఉన్నారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు 18 మంది POలు, 18 APOలు, 36 OPOలు, 18 మంది ఎంఓలను నియమించినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News December 18, 2025

ఫ్లాట్‌‌గా మొదలైన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 25,779 వద్ద, సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 84,403 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ లాభాల్లో, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాక్, మారుతి, ఎల్అండ్‌టీ నష్టాల్లో నడుస్తున్నాయి.

News December 18, 2025

ఏలూరు: కన్న కొడుకే గెంటేశాడు..!

image

కన్నకొడుకే తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన ముదినేపల్లి (M) కొత్తపల్లిలో చోటు చేసుకుంది. బాధితురాలు కోటేశ్వరమ్మ వివరాల మేరకు.. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటిని నిర్మించుకోగా చిన్న కొడుకు దానికి లాక్కున్నాడు. కొంత కాలం ఇంట్లో ఉంటామని చెప్పి కుమారుడు, కోడలు ఇంటిని స్వాధీనం చేసుకుని తనను బయటకు పంపేశారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని బుధవారం ఏలూరులో RDO అచ్యుత అంబరీష్‌ను కోరింది.

News December 18, 2025

GNT: 7,000 పైగా పాటలు పాడిన గొప్ప గాయకుడు

image

తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 – డిసెంబర్ 18, 2000) ఉమ్మడి గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో జన్మించారు. ప్రసిద్ధమైన పాటలు అయ్యయో జేబులో డబ్బులు పోయెనే, మాయాబజార్ సినిమాలోని వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఈయన మధురకంఠము నుంచి జాలువారినవే. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడారు.