News January 31, 2025
పార్వతీపురం: ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు పిజి.ఆర్.ఎస్ నిలుపుదల

జిల్లాలో శాసన మండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిలుపుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఫిబ్రవరి, 27వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఓట్ల లెక్కింపు కార్యక్రమం మార్చి, 3వ తేదీన జరుగుతుందన్నారు.
Similar News
News December 5, 2025
వనపర్తి జిల్లా TODAY.. టాప్ NEWS

>WNP సర్పంచ్ పదవికి MBBS విద్యార్థిని నిఖిత పోటీ
>WNP: పెద్దగూడెంలో బీజేపీలో భారీ చేరికలు
>WNP: CM దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: BJP
>PNGL: ఈ ప్రయాణం ప్రమాదకరం
>WNP: బడి బయటి పిల్లలను పాఠశాలలకు పంపించాలి
>GPT: కక్షపూరిత రాజకీయాలను మానుకోవాలి: BRS
>ATKR: ఎన్నికల విధులు బాధ్యత ఈ విధంగా నిర్వహించాలి: ఎంపీడీఓ
>WNP: అభ్యర్థులకు వ్యాయ నిబంధనలపై అవగాహన కల్పించాలి
News December 5, 2025
క్రియేటివ్ సిటీగా అమరావతి: చంద్రబాబు

AP: అమరావతిలో నిర్మించే ప్రతి భవనం విలక్షణంగా ఉండాలని, పచ్చదనంతో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలని CRDA భేటీలో CM CBN సూచించారు. మౌలిక సదుపాయాల కోసం నాబార్డు ₹7,380 కోట్ల రుణానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. నాణ్యతలో రాజీపడకుండా గడువుకన్నా ముందే నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. తెలుగు ఆత్మగౌరవానికి, వైభవానికి ప్రతీకగా నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.
News December 5, 2025
మోదీ-పుతిన్ నవ్వులు.. ఎక్కడో మండుతున్నట్టుంది!

పుతిన్ భారత పర్యటనతో US అధ్యక్షుడు ట్రంప్కు ‘ఎక్కడో మండుతున్నట్టుంది’ అంటూ ఇండియన్ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ట్రంప్ ఫొటోలతో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మోదీ-పుతిన్ నవ్వులు చూసి ఆయన ఏడుస్తుంటారని పోస్టులు పెడుతున్నారు. టారిఫ్స్ ఇంకా పెంచుతాడేమోనని సెటైర్లు వేస్తున్నారు. రష్యాతో సంబంధాలు పెంచుకున్నామనే అక్కసుతోనే ట్రంప్ మనపై అధిక టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే.


