News January 30, 2025
పార్వతీపురం: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిందని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్ల పరిశీలన 11వ తేదీన జరుగుతుందని, 13వ తేదీలోగా ఉపసంహరణ చేసుకోవాలని తెలిపారు.
Similar News
News November 16, 2025
కర్నూలు: 675 మందిపై కేసులు

జనవరి-అక్టోబర్ వరకు జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 675 మంది మైనర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మొదటిసారి పట్టుబడితే హెచ్చరికతో దండిస్తామని, రెండోసారి అయితే రూ.5 వేల జరిమానా విధిస్తున్నామని చెప్పారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసిన మైనర్లతో పాటు వాహన యజమానులపైనా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.
News November 16, 2025
సంగారెడ్డి: నేడు ఉమ్మడి జిల్లా రైఫిల్ షూటింగ్ పోటీలు

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా రైఫిల్ షూటింగ్ బాలబాలికల అండర్-14, 17 సంగారెడ్డి లోని శాంతి నగర్ సెయింట్ ఆంథోనీ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఓపెన్ ఫైట్, పిప్ ఫైట్, పిస్తోల్ ఎంపికలు జరుగుతాయని చెప్పారు. ఒరిజినల్ బోనాఫైడ్, ఆధార్ కార్డుతో ఉదయం 9:30 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు.
News November 16, 2025
పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.


