News January 30, 2025
పార్వతీపురం: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిందని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్ల పరిశీలన 11వ తేదీన జరుగుతుందని, 13వ తేదీలోగా ఉపసంహరణ చేసుకోవాలని తెలిపారు.
Similar News
News February 19, 2025
కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయి, రెడీగా ఉండండి: కేసీఆర్

TG: రాష్ట్రంలో త్వరలోనే ఉపఎన్నికలు వస్తాయని BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతోందని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని, ఇక లేవదని వ్యాఖ్యానించారు.
News February 19, 2025
నిద్ర చెడగొడుతోందని కోడిపై RDOకు ఫిర్యాదు..

పొద్దున 3 గంటలకు అదే పనిగా కూస్తోందని కేరళ, పల్లిక్కల్ వాసి రాధాకృష్ణ కురూప్ ఓ కోడిపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కొన్నాళ్లుగా నిద్రను చెడగొడుతూ ప్రశాంతమైన తన జీవితానికి భంగం కలిగిస్తోందని ఆయన స్థానిక RDOకు మొరపెట్టుకున్నారు. దానిని సీరియస్గా తీసుకున్న అధికారి వెంటనే ఇంటికొచ్చి పరిశీలించారు. పక్కింటి మేడపై కోళ్ల షెడ్డును గమనించి దానిని 14 రోజుల్లో మరోచోటకు మార్చాలని ఆదేశించారు.
News February 19, 2025
మహబూబాబాద్: అధికారులతో సమీక్షించిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ అద్వైత్ కుమార్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ రంగానికి, తాగునీటికి నిర్మాణ రంగానికి నిధులు కేటాయించామని అన్నారు. ఎండాకాలంలో ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ పథకం అందేలా చూడాలని అధికారులకు తెలిపారు.