News February 6, 2025
పార్వతీపురం: ‘ఒక్క మాతా, శిశు మరణం కూడా సంభవించకూడదు’

పార్వతీపురం జిల్లాలో ఒక్క మాతా, శిశు మరణం కూడా సంభవించకూడదని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులకు హితవు పలికారు. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రసవం అయ్యే వరకు సంబంధిత పిహెచ్సీ వైద్యాధికారి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రసవాలు సురక్షంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News October 28, 2025
NLG: శిశు విక్రయ ఘటనపై సీరియస్… కేసు నమోదు

నల్గొండ జిల్లాలో శిశు విక్రయం ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. శిశువును అమ్మిన తల్లిదండ్రులు బాబు, పార్వతితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులు, మధ్య దళారులుగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేయాలని నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News October 28, 2025
VZM: రేపటి జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా

మొంథా తుఫాన్ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో బి. సత్యనారాయణ మంగళవారం తెలిపారు. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. సభ్యులు, అధికారులు దీనిని గమనించాలని సూచించారు.
News October 28, 2025
‘భారత్’ అనే శబ్దానికి అర్థమిదే..

‘భా’ అంటే జ్ఞానం. ‘ర’ అంటే ఆనందించడం. ‘త’ అంటే తరింపజేయడం. జ్ఞాన మార్గంలో ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా తరింపజేసేవాడే భారతీయుడు అని దీనర్థం. అందుకే ఇది కర్మభూమిగానూ ప్రసిద్ధి చెందింది. అంటే.. ఇక్కడ మన కర్మల ద్వారా మోక్షాన్ని, ముక్తిని సాధించుకోవచ్చని అంటారు. భారతదేశం ఆత్మజ్ఞానాన్ని, తత్వ వివేకాన్ని పొందేందుకు, జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అత్యంత అనువైన, పవిత్రమైన దేశంగా పరిగణిస్తారు. <<-se>>#Sanathana<<>>


