News January 25, 2025
పార్వతీపురం: ‘ఓటే సామాన్యుడి ఆయుధం’

ఓటే సామాన్యుడి ఆయుధమని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం కలెక్టరేట్ ఆవరణలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. తమ ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఓటు ప్రతి భారతీయుడి హక్కు అని పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
మావోయిస్టు దామోదర్ పేరుతో ఫోన్ కాల్స్ కలకలం!

మావోయిస్టు అగ్రనేత తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావ్@ దామోదర్ పేరిట కొందరు వ్యాపారులకు ఫోన్ చేస్తుండటం జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాలోని ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్ పేరిట ఫోన్ చేసి డబ్బులు అడగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయాన్ని జిల్లాలో అక్కడక్కడ స్థానికులు మాట్లాడుకోవడం గమనార్హం. దామోదర్ పేరుతో ఫోన్ ఎవరు చేశారు? దామోదర్ ఎక్కడున్నాడనే విషయంపై సందిగ్ధం నెలకొంది.
News November 22, 2025
నల్గొండ జిల్లాలో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు

ఒకవైపు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. మరోవైపు కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జనజీవనం చాలా ఖరీదైపోతుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కోడి గుడ్డు ధర రూ.8కి చేరడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. గుడ్ల ధరలు కొండెక్కినా కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.220లకు తగ్గడం విశేషం.
News November 22, 2025
ASF: అక్రమాలను కట్టడి చేసిన SP కాంతిలాల్ పాటిల్

ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పీగా నితికా పంత్ నియమితులయ్యారు. గతంలో విధులు నిర్వహించిన ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గవర్నర్ ఏడీసీగా బదిలీ అయ్యారు. ఎస్పీ కాంతిలాల్ తన 5 నెలల పదవి కాలంలో అక్రమ ఇసుక, మట్కా, జూదం, నకిలీ విత్తనాలు, పీడీఎస్ బియ్యం తదితర అక్రమ వ్యాపారాలను కట్టడి చేయడంలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 72 కేసులు నమోదు చేసి 122 మందిని అరెస్టు చేశారు.


