News April 9, 2025
పార్వతీపురం : కంటైనర్లో అంగన్వాడీ కేంద్రం

పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో కంటైనర్లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీడీపీఓ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామంలో ఐదవ అంగన్వాడీ నిర్వహణకు సచివాలయం వద్ద కంటైనర్లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే సాలూరులో ఆసుపత్రులను సైతం కంటైనర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 24, 2026
YCP హయాంలో హిందూమతంపై దాడి: CBN

AP: వైసీపీ ప్రభుత్వంలో తిరుమలపైనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హిందూమతంపై దాడులు చేశారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘2,032 దేవాలయాలపై దాడి చేశారు. 59 విగ్రహాలు చోరీ అయ్యాయి. ఎన్నో చోట్ల విగ్రహాలను అపవిత్రం చేశారు. అంతర్వేది రథం దగ్ధాన్ని తేనెటీగల దాడి అని చెప్పారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు’ అని వివరించారు. ఎవరైనా దేవాలయాల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
News February 24, 2026
నిర్మల్: పది పరీక్షలకు 9,758 మంది విద్యార్థులు

పదవ తరగతి పరీక్షలను మార్చి 14 నుంచి, ఏప్రిల్ 16వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి, 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు. జిల్లావ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 9,758 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
News February 24, 2026
నిర్మల్: ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయండి: ఎస్పీ

విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఎస్పీ జానకి షర్మిల విద్యార్థులకు సూచించారు. పరీక్షలు ప్రారంభం నుంచి ముగింపు వరకు నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించబడుతుందని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా, ప్రశ్నపత్రాలు రవాణా పరీక్ష అనంతరం సమాధాన పత్రాల భద్రత కోసం ప్రత్యేక ఎస్కార్ట్ను ఏర్పాటు చేశామన్నారు.


