News April 14, 2025

పార్వతీపురం కలెక్టరేట్‌లో ఘనంగా అంబేడ్కర్ జయంతి

image

భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. డా. బి.ఆర్. అంబేడ్కర్ తాత్విక చింతన దేశాన్ని నడిపిస్తుందన్నారు. దేశం ఏకతాటిపై నడవడానికి కారణం అంబేడ్కర్ దూర దృష్టి మాత్రమే అన్నారు.

Similar News

News December 4, 2025

ఖమ్మం: మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శనీయం: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో పాల్గొని చిత్రపటానికి నివాళి అర్పించారు. రోశయ్య ఆర్థిక, విద్య, వైద్య, రవాణా తదితర శాఖల్లో సేవలందించడమే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు-కర్ణాటక గవర్నర్‌గా పనిచేసిన మహనీయుడని కలెక్టర్ అన్నారు.

News December 4, 2025

ఈ రైల్వే లైన్ కోనసీమ ప్రజల చిరకాల వాంఛ: ఎంపీ గంటి

image

అమలాపురం పార్లమెంటు పరిధిలోని కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవును అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ కోరారు. కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ నిర్మాణం కోనసీమ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని ఆయనకు వివరించారు. ఇప్పటివరకు జరిగిన రైల్వే లైన్ పనుల గురించి ఆయన మంత్రికి వివరాలు తెలియజేశారు.

News December 4, 2025

6న అంబాజీపేటలో ఉమ్మడి తూ.గో. అండర్-17 క్రికెట్ జట్టు ఎంపిక

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-17 బాలుర క్రికెట్ జట్టును ఈ నెల 6న అంబాజీపేట జడ్పీహెచ్ స్కూల్లో ఎంపిక చేయనున్నట్లు డీఈవో షేక్ సలీం బాషా తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఉదయం 9 గంటలలోపు హైస్కూల్‌కు చేరుకుని వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాల కోసం ఎస్జీఎఫ్ కార్యదర్శులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.