News March 17, 2025

పార్వతీపురం: కేటగిరి సి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ల్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో కేటగిరి సి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాలో ఉన్నట్లు DEO ఎన్ తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 22 కేటగిరీ సి పరీక్ష కేంద్రాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు. జిల్లావ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాలలో పది పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయని ఆయన తెలిపారు. 67 మంది చీఫ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 22, 2025

ఇల్లంతకుంట: ‘అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర’

image

ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి పథకంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, మహిళల ఆత్మ గౌరవానికి తోడ్పడుతుందని మానకొండూర్ MLA సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట రైతు వేదికలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా ముఖ్యఅతిథిగా మానకొండూర్ MLA కవ్వంపల్లి పాల్గొన్నారు. ఆయన వెంట ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు.

News November 22, 2025

అయిజ: రైతులను ప్రోత్సహించేందుకే సంబరాలు

image

రైతులను వ్యవసాయపరంగా ప్రోత్సహించేందుకు రైతు సంబరాలు నిర్వహిస్తున్నట్లు అయిజ సింగల్ విండో మాజీ ఛైర్మన్ సంకాపూర్ రాముడు పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లిలో వెలసిన వరాహ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఆలయ ప్రాంగణంలో అంతర్రాష్ట్ర న్యూ కేటగిరి విభాగం బండలాగు పోటీలు ప్రారంభించారు. వ్యవసాయంలో ప్రధానమైన ఎడ్ల ప్రాముఖ్యత గురించి రైతులకు వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News November 22, 2025

తిరిగి ప్రారంభమైన దక్షిణ ప్రాకారం విస్తరణ పనులు

image

వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ ప్రాకారం విస్తరణ పనులను తిరిగి ప్రారంభించారు. కాగా, భారీ బహుబలి యంత్రంతో రోడ్డుపై రంధ్రాలు చేసేందుకు ప్రయత్నించగా, రోడ్డు వెడల్పుపై స్పష్టత కోరుతూ స్థానికులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, ఇతర అధికారులు స్థానికులకు స్పష్టతనిచ్చి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. దీంతో పనులు పున: ప్రారంభమయ్యాృయి.