News March 17, 2025
పార్వతీపురం: కేటగిరి సి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ల్

పార్వతీపురం మన్యం జిల్లాలో కేటగిరి సి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాలో ఉన్నట్లు DEO ఎన్ తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 22 కేటగిరీ సి పరీక్ష కేంద్రాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు. జిల్లావ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాలలో పది పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయని ఆయన తెలిపారు. 67 మంది చీఫ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 19, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 9

50. జ్ఞానం అంటే ఏమిటి? (జ.మంచి చెడ్డల్ని గుర్తించగలగడం)
51. దయ అంటే ఏమిటి? (జ.ప్రాణులన్నింటి సుఖం కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? (జ.సదా సమభావం కలిగి ఉండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (జ.ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? (జ.ఇంద్రియ నిగ్రహం)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 19, 2025
22న హనుమకొండలో జాబ్ మేళా

ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి శాఖ అధికారి మల్లయ్య తెలిపారు. సుమారు 60 ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ మేళాను చేపట్టారు. ఎస్సెస్సీ (SSC), డిగ్రీ చదివి, 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న యువతీ యువకులు ధ్రువీకరణ పత్రాలతో ములుగు రోడ్డులోని కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు.
News November 19, 2025
మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 1,70,331 చీరలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 1,14,681 చీరలు జిల్లాకు చేరుకున్నాయని, మిగతా 55,650 చీరలు త్వరలోనే వస్తాయని వెల్లడించారు.


