News March 17, 2025
పార్వతీపురం: కేటగిరి సి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ల్

పార్వతీపురం మన్యం జిల్లాలో కేటగిరి సి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాలో ఉన్నట్లు DEO ఎన్ తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 22 కేటగిరీ సి పరీక్ష కేంద్రాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు. జిల్లావ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాలలో పది పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయని ఆయన తెలిపారు. 67 మంది చీఫ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 5, 2026
బంగ్లాదేశ్ ఎన్నికలపై భారత్ కలవరపాటు!

బంగ్లాదేశ్లో మార్చిలో జరిగే ఎన్నికలు భారత ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాలో నెలకొన్న పరిస్థితులు, తాత్కాలిక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దీనికి కారణాలుగా ఉన్నాయి. నిషేధిత అవామీ లీగ్ను జాతీయ పార్టీ BNP, జమాత్తో పాటుగా ఎన్నికల పోటీకి అనుమతించాలనే భారత్ కోరుకుంటోంది. స్వేచ్ఛ లేకుండా ఎన్నికలు జరిగితే మైనారిటీలపై దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన చెందుతోంది.
News January 5, 2026
గ్రామాభివృద్ధికి కూటమి కృషి చేస్తుంది: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్

గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉండి నియోజవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి జుత్తుగ నాగరాజు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో సీసీ రోడ్డుకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ వనమా సుబ్బలక్ష్మి శ్రీనివాస్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు బద్రి, పాసర్ల శ్రీనివాస్, నాగేశ్వరావు, పండు, కూటమి నాయకులు ఉన్నారు.
News January 5, 2026
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కృత్తికా శుక్లా

పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు త్వరితగతిన మోక్షం కలిగించాలని కలెక్టర్ కృత్తికా శుక్లా అధికారులను ఆదేశించారు. నరసరావుపేటలోని కలెక్టరేట్లో నిర్వహించిన అర్జీల స్వీకరణలో ఆమె పాల్గొన్నారు. DRO మురళి, RDO మధులతలతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల వినతులను స్వయంగా స్వీకరించారు. సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు అర్జీలను బదిలీ చేస్తూ, నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కారం చూపాలన్నారు.


