News March 17, 2025

పార్వతీపురం: కేటగిరి సి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ల్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో కేటగిరి సి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాలో ఉన్నట్లు DEO ఎన్ తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 22 కేటగిరీ సి పరీక్ష కేంద్రాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు. జిల్లావ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాలలో పది పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయని ఆయన తెలిపారు. 67 మంది చీఫ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 18, 2025

తిరుపతి జనాభా ఇలా పెరుగుతోంది..!

image

తిరుపతి 1886లో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడింది. అప్పటి నగర జనాభా కేవలం 2,600 మాత్రమే. 1941 నాటికి ఇది 28వేలకు చేరింది. తదుపరి దశల్లో 46వేలకు పెరిగింది. 1970లో జనాభా లక్షకు చేరువైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తిరుపతిలో ప్రస్తుత జనాభా 3,77,000గా ఉంది. రోజుకు లక్ష మంది భక్తులు వస్తున్నారు. 1977 తర్వాత తిరుపతి నగరం వేగంగా అభివృద్ధి చెందింది. పలు గ్రామాల నుంచి జనాలు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు.

News November 18, 2025

తిరుపతి జనాభా ఇలా పెరుగుతోంది..!

image

తిరుపతి 1886లో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడింది. అప్పటి నగర జనాభా కేవలం 2,600 మాత్రమే. 1941 నాటికి ఇది 28వేలకు చేరింది. తదుపరి దశల్లో 46వేలకు పెరిగింది. 1970లో జనాభా లక్షకు చేరువైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తిరుపతిలో ప్రస్తుత జనాభా 3,77,000గా ఉంది. రోజుకు లక్ష మంది భక్తులు వస్తున్నారు. 1977 తర్వాత తిరుపతి నగరం వేగంగా అభివృద్ధి చెందింది. పలు గ్రామాల నుంచి జనాలు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు.

News November 18, 2025

వాహన ఫిట్‌నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు

image

వాహనాల ఫిట్‌నెస్‌ ఫీజుకు కేంద్రం మూడు(10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. 20ఏళ్లు పైబడిన వాహనాలకు 10రెట్లు పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25వేలు, మీడియం కమర్షియల్ వాహనాల(MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల(LCV)కు రూ.15వేలు, త్రీ వీలర్స్‌కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది.