News January 30, 2025
పార్వతీపురం: గర్భిణీ స్త్రీలకు శుద్ధ జలం అందిస్తున్నాం

వసతి గృహంలో ఉండే గర్భిణీ స్త్రీలకు మినరల్ వాటర్ అందిస్తున్నామని పార్వతీపురం ITDA ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఇప్పటి వరకు ఆహారం, మంచి నీరు సప్లై చేసే ఏజెన్సీ వసతి గృహాం నిర్వహించింది. దీని కాలపరిమితి ముగియడంతో ఏజెన్సీ వసతి గృహం మెయింటెనెన్స్ను ఆర్.ఓ. ప్లాంట్ కంపెనీకి తదుపరి అందజేస్తామన్నారు.
Similar News
News December 1, 2025
సిరిసిల్ల: వాలీబాల్ టోర్నీలో క్యాంప్ ఫైర్

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాలీబాల్ క్రీడాకారులు సోమవారం సాయంత్రం క్యాంప్ ఫైర్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 బాలికల, 10 బాలుర జట్లు పాల్గొంటున్నాయి. రోజంతా మ్యాచ్లతో బిజీబిజీగా గడిపిన క్రీడాకారులు సాయంత్రం కాగానే క్యాంప్ ఫైర్లో ఆడి పాడి సేద తీరారు.
News December 1, 2025
సిరిసిల్ల: వాలీబాల్ టోర్నీలో క్యాంప్ ఫైర్

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాలీబాల్ క్రీడాకారులు సోమవారం సాయంత్రం క్యాంప్ ఫైర్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 బాలికల, 10 బాలుర జట్లు పాల్గొంటున్నాయి. రోజంతా మ్యాచ్లతో బిజీబిజీగా గడిపిన క్రీడాకారులు సాయంత్రం కాగానే క్యాంప్ ఫైర్లో ఆడి పాడి సేద తీరారు.
News December 1, 2025
WNP: ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి: TPUS

గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో గర్భిణీ ఉపాధ్యాయులను, చంటి పిల్లల తల్లులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, PHC ఉపాధ్యాయులను, రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని తపస్ ఆధ్వర్యంలో డీపీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్ ఉన్నారు.


