News January 30, 2025
పార్వతీపురం: గర్భిణీ స్త్రీలకు శుద్ధ జలం అందిస్తున్నాం

వసతి గృహంలో ఉండే గర్భిణీ స్త్రీలకు మినరల్ వాటర్ అందిస్తున్నామని పార్వతీపురం ITDA ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఇప్పటి వరకు ఆహారం, మంచి నీరు సప్లై చేసే ఏజెన్సీ వసతి గృహాం నిర్వహించింది. దీని కాలపరిమితి ముగియడంతో ఏజెన్సీ వసతి గృహం మెయింటెనెన్స్ను ఆర్.ఓ. ప్లాంట్ కంపెనీకి తదుపరి అందజేస్తామన్నారు.
Similar News
News February 26, 2026
T20 WC: టాస్ ఓడిన భారత్

చెన్నై వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచులో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ఇండియా జట్టులో 2 మార్పులు జరిగాయి. రింకూ స్థానంలో సంజూ, సుందర్ ప్లేస్లో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు.
IND: సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్, వరుణ్, బుమ్రా.
ZIM: మారుమని, బెనెట్, మేయర్స్, బర్ల్, రజా, మున్యోంగా, ముసెకివా, ఇవాన్స్, మపోసా, ముజరబని, ఎంగర్వ.
News February 26, 2026
NLG: ఇంటర్ పరీక్షలు.. రెండో రోజు 286 మంది డుమ్మా..!

జిల్లాలో రెండో రోజు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 286 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,480 మంది విద్యార్థులకు గాను 11,265 మంది హాజరుకాగా, 215 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,637 మంది విద్యార్థులకు గాను 1,566 మంది హాజరుకాగా, 71 మంది గైర్హాజరయ్యారు.
News February 26, 2026
బాపట్ల: 40 బైకులు, 4 లీటర్ల నాటుసారా స్వాధీనం- ఎస్పీ

జిల్లాలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించి 40 బైకులు, 4 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. బాపట్ల డీఎస్పీ జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు తెలిపారు.


