News January 30, 2025

పార్వతీపురం: గర్భిణీ స్త్రీలకు శుద్ధ జలం అందిస్తున్నాం

image

వసతి గృహంలో ఉండే గర్భిణీ స్త్రీలకు మినరల్ వాటర్ అందిస్తున్నామని పార్వతీపురం  ITDA ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఇప్పటి వరకు ఆహారం, మంచి నీరు సప్లై చేసే ఏజెన్సీ వసతి గృహాం నిర్వహించింది. దీని కాలపరిమితి ముగియడంతో ఏజెన్సీ వసతి గృహం మెయింటెనెన్స్‌ను ఆర్.ఓ. ప్లాంట్ కంపెనీకి తదుపరి అందజేస్తామన్నారు.

Similar News

News November 24, 2025

జమ్మికుంట: క్వింటా పత్తి గరిష్ఠ ధర రూ.6,950

image

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్‌కు రైతులు 70 వాహనాల్లో 594 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.6,950, కనిష్టంగా రూ.6,000 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 6 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,500 ధర లభించింది. గతవారం కంటే పత్తి ధర తాజాగా రూ.150 తగ్గింది.

News November 24, 2025

పెద్దపెల్లి: ‘మూడో ఏటా ప్రవేశిస్తున్నా.. హామీలు నెరవేర్చేలేదు’

image

ఆరు గ్యారంటీలతో సహా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బతుకులు మాత్రం మార్చలేకపోయిందని సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్ ప్రజాపంథా) కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో ఏట ప్రవేశించే సందర్భంలో సంబరాలు చేసుకుంటోందని, కానీ హామీలు నెరవేర్చలేదని పేర్కొంటూ సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

News November 24, 2025

SRPT: సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ రాక ఆందోళన

image

సూర్యాపేట జిల్లాలో సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు రెండేళ్లుగా పెన్షన్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు మంజూరు కాకపోగా, తీసుకున్న సర్టిఫికెట్ల గడువు ముగిసిపోతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన వికలాంగులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు.