News January 30, 2025

పార్వతీపురం: గర్భిణీ స్త్రీలకు శుద్ధ జలం అందిస్తున్నాం

image

వసతి గృహంలో ఉండే గర్భిణీ స్త్రీలకు మినరల్ వాటర్ అందిస్తున్నామని పార్వతీపురం  ITDA ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఇప్పటి వరకు ఆహారం, మంచి నీరు సప్లై చేసే ఏజెన్సీ వసతి గృహాం నిర్వహించింది. దీని కాలపరిమితి ముగియడంతో ఏజెన్సీ వసతి గృహం మెయింటెనెన్స్‌ను ఆర్.ఓ. ప్లాంట్ కంపెనీకి తదుపరి అందజేస్తామన్నారు.

Similar News

News November 28, 2025

గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే: జేసీ

image

మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ యం.వెంకటేశ్వర రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని, కుల వివక్షత నిర్మూలనకై పోరాడారన్నారు.

News November 28, 2025

WPL వేలంలో అదరగొట్టిన తెలుగమ్మాయిలు

image

WPL 2026 వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్ సత్తా చాటారు. గొంగడి త్రిషను రూ.10 లక్షలకు యూపీ వారియర్స్‌, మమతను రూ.10 లక్షలకు ఢిల్లీక్యాపిటల్స్‌, క్రాంతిరెడ్డిని రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకున్నాయి. అరుంధతి రెడ్డిని రూ.75 లక్షలకు RCB జట్టు ఎంచుకుంది. ఇటీవలి వన్డే వరల్డ్‌ కప్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన నల్లపు రెడ్డి శ్రీచరణిని రూ.1.30 కోట్లతో ఢిల్లీ తిరిగి సొంతం చేసుకుంది.

News November 28, 2025

స్విగ్గీ, జొమాటో, జెప్టో గోడౌన్లలో ఇదీ పరిస్థితి

image

TG: హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థల గోడౌన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. స్విగ్గీ, జెప్టో, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు చెందిన 75 గోడౌన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఎక్స్‌పైర్డ్, మిస్ బ్రాండెడ్ వస్తువులను సీజ్ చేశారు. కుళ్లిన ఫ్రూట్స్, కూరగాయలను గుర్తించారు. పలు వస్తువుల శాంపిల్స్ సేకరించారు. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు.