News January 27, 2025

పార్వతీపురం: గ్రీవెన్స్ ద్వారా 105 వినతులు స్వీకరణ

image

పార్వతీపురం కల్టెరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిశీలించి, ఆ సమస్య పరిష్కార దిశగా కృషిచేయాలని అన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు. కార్యక్రమంలో ప్రజల నుంచి 105 వినతులను స్వీకరించారు.

Similar News

News February 13, 2025

HYD: 500 పాఠశాలల్లో AI బోధనకు కృషి: సీఎం

image

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని, HYDతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌దే అని పేర్కొన్నారు.

News February 13, 2025

పోలీసుల నోటీసులపై పోచంపల్లి రియాక్షన్

image

TG: <<15447380>>పోలీసుల నోటీసులపై<<>> MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫామ్ హౌజ్ తనదేనని, రమేశ్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు. అతను వేరే వ్యక్తికి లీజుకు ఇచ్చారనే విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఫామ్ హౌస్ వెళ్లి ఎనిమిదేళ్లు దాటినట్లు చెప్పారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించినట్లు తెలిపారు. కాగా కోడి పందేలు జరిగాయని గేమింగ్, యానిమల్ యాక్ట్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు.

News February 13, 2025

మడకశిర సీఐ రామయ్య సస్పెండ్ 

image

మడకశిర అప్ గ్రేడ్ సీఐగా పని చేస్తున్న రాగిరి రామయ్యను సస్పెండ్ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని జిల్లా ఎస్పీ రత్నకు ఇటీవల ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఎస్పీ వెంటనే విచారణకు ఆదేశించి ఆయనను వీఆర్‌కి పంపారు. మహిళ ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం సీఐని నేడు సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

error: Content is protected !!