News April 12, 2025
పార్వతీపురం జిల్లాకు 6వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో పార్వతీపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 5,867 మంది పరీక్షలు రాయగా 4,519 మంది ఉత్తీర్ణులయ్యారు. 77% పాస్ పర్సంటేజీతో జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 5,335 మందికి 4,609 మంది పాస్ కాగా 86% పాస్ పర్సంటేజీతో 7వ స్థానంలో నిలిచింది.
Similar News
News October 15, 2025
కేసుల త్వరగా పరిష్కరించాలి: రామగుండం సీపీ

క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేసుల పరిష్కార శాతం పెంపు, పాత/దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న (UI&PT)కేసుల త్వరగా పరిష్కరించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. MNCLజోన్ పోలీస్ అధికారులతో బుధవారం నేర సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్ధతిని కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలన్నారు. నిందితులకు కోర్టులో శిక్షలు పడే విధంగా సాక్షాదారాలను కోర్టుకు అందజేయాలని సూచించారు.
News October 15, 2025
సాయంకాలం నిద్రపోతున్నారా?

పగలు ముగిసి, రాత్రి మొదలయ్యే సమయంలో దేవతలందరూ శివ తాండవ వీక్షణలో తన్మయత్వం పొందుతూ ఉంటారు. అందువల్ల దైవ రక్షణ ప్రభావం కొంత మేర తగ్గుతుంది. ఈ అవకాశాన్ని అసుర శక్తులు వాడుకుంటాయి. ప్రజలను బాధించడానికి నిద్ర రూపంలో మనలోకి ప్రవేశించాలని చూస్తాయి. ఈ బలహీనతలకు మనం లొంగితే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ వేళలో నిద్ర పోవద్దని పెద్దలు అంటుంటారు. * మరిన్ని ధర్మ సందేహాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 15, 2025
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: అదనపు కలెక్టర్

గూడూరు మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలోని వంట గది, డైనింగ్ హాల్, స్టాక్ రూమ్లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు.