News April 12, 2025

పార్వతీపురం జిల్లాకు 6వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో పార్వతీపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 5,867 మంది పరీక్షలు రాయగా 4,519 మంది ఉత్తీర్ణులయ్యారు. 77% పాస్ పర్సంటేజీతో జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 5,335 మందికి 4,609 మంది పాస్ కాగా 86% పాస్ పర్సంటేజీతో 7వ స్థానంలో నిలిచింది.

Similar News

News April 11, 2026

దేవరకొండ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగి ఘరానా మోసం

image

దేవరకొండ డిండి రోడ్డులోని బ్యాంకులో ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఖాతాదారుల సొమ్ముతో ఉడాయించాడు. విదేశాల్లో ఉంటున్న, సుదీర్ఘకాలంగా లావాదేవీలు జరపని వారి అకౌంట్లను లక్ష్యంగా చేసుకుని అధికారుల కళ్లుగప్పి పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసి వాటితో పరారయ్యాడు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి అధికారులు రహస్యంగా దర్యాప్తు చేపట్టి, నష్టపోయిన సొమ్ముపై లెక్కలు తీస్తున్నారు.

News April 11, 2026

ప.గో: పెళ్లింట తీవ్ర విషాదం

image

పెదవేగిలోని వలసపల్లి సమీపంలో <<19612501>>గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలపూడి(M)ముక్కంపాడుకు<<>> చెందిన సచివాలయ ఉద్యోగి సుధీర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇతని భార్య గర్భిణీ. అంతేకాకుండా మరోవైపు మృతుని సోదరునికి ఈ నెల 25న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోవడంతో పెళ్లింట శోక సంద్రంలో మునిగిపోయారు.

News April 11, 2026

ఎల్లారెడ్డిపేట: సెక్యూరిటీ లేకే.. ఏటీఎం ఎత్తుకెళ్లారు!

image

ఎల్లారెడ్డిపేటలో ఎస్బీఐ ఏటీఎం మిషన్‌ చోరీకి భద్రతా లోపమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మండలంలోని ఐదు ఏటీఎంలలో కేవలం ఒక సిరిసిల్ల బ్యాంకుకు మాత్రమే సెక్యూరిటీ గార్డు ఉండటం గమనార్హం. జిల్లాలోనే ఇది మొట్టమొదటి వింత చోరీ కావడంతో ఎస్పీ తీవ్రంగా పరిగణించి, నిందితుల వేట కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భద్రతా నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.