News August 31, 2024

పార్వతీపురం: జిల్లాలోని స్కూళ్లకు సోమవారం సెలవు

image

ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు పనిచేస్తాయని ఆయన చెప్పారు. వర్షాల కారణంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News February 18, 2025

జిల్లాలో హోటల్స్‌కు ప్రభుత్వం రేటింగ్: కలెక్టర్

image

పర్యావరణ హితంగా, పర్యాటకులను ఆకర్షించేలా నడిపే హోటళ్లకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తుందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో హోటల్ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చే ఈ రేటింగ్‌ను హోటల్స్ ఆన్‌లైన్ లో అప్లోడ్ చేసుకోవచ్చునని, అందువలన ఆయా హోటల్స్‌కు ర్యాంకింగ్ బుక్ చేసుకునే వారికీ తెలుస్తుందని పేర్కొన్నారు.

News February 17, 2025

VZM: మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ

image

మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని విజయనగరం ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో రామతీర్థాలకు 45 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ఎస్.కోట డిపో నుంచి పుణ్యగిరికి 35 బస్సులు, ఎస్.కోట నుంచి సన్యాసిపాలెంకు 10 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

News February 17, 2025

విజయనగరం: ఆమె జీబీఎస్‌తో చనిపోలేదు..!

image

విశాఖ KGHలో ఓ వృద్ధురాలు గుండెపోటుతో చనిపోయిందని సూపరింటెండెంట్ శివానంద్ చెప్పారు. ‘విజయనగరం(D) L.కోట మండలానికి చెందిన వృద్ధురాలు(63) గుయిలెయిన్-బారే సిండ్రోమ్(జీబీఎస్) అనుమానాస్పద లక్షణాలతో ఫిబ్రవరి 6న KGHలో చేరారు. ఆమెకు షుగర్, బీపీ ఉన్నాయి. మేం అందజేసిన చికిత్సతో కాస్త కోలుకున్నారు. ఇవాళ ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో చనిపోయినట్లు తేలింది. ఆమె GBSతో చనిపోలేదు’అని ఆయన తెలిపారు.

error: Content is protected !!