News February 22, 2025
పార్వతీపురం: జిల్లాలో ఆదర్శ పాఠశాలల్లో ఆరోవ తరగతి ప్రవేశ పరీక్ష

పార్వతీపురం జిల్లాలో 4 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డిఇఓ ఎన్. తిరుపతి నాయుడు తెలిపారు. సాలూరు, మక్కువ, కురుపాం, భామిని పాఠశాలల్లో ఏప్రిల్ 20 ఉదయం 10 గంటలకు పరీక్ష ఉంటుందన్నారు. ఐదవ తరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తులు www.apms.apcfss.in లో ఆన్లైన్లో చేసుకోవాలన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News November 21, 2025
ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్ డా.టి.రవిరాజు అన్నారు. ఉద్దానం ప్రాంతంలో 18% జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.01కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిటి, మందస, వజ్రపు కొత్తరు ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నామన్నారు.
News November 21, 2025
మొక్కలకు బోరాన్ ఎందుకు అవసరం?

బోరాన్ అనే ఈ సూక్ష్మధాతు మూలకం బోరిక్ యాసిడ్ స్థితిలో మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. ఇది మొక్కల్లో, నేలల్లో నిశ్చల స్థితిలో ఉంటుంది. మొక్క ఆకులలో తయారయ్యే ఆహారాన్ని అన్ని భాగాలకు చేరవేయడంలో బోరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కల సంపర్క ప్రక్రియలో ఉపయోగపడే పుప్పొడి ఉత్పత్తిలో, పుప్పొడి కణాల ఎదుగుదలను నియంత్రిస్తూ విత్తన, పండ్ల ఎదుగుదలను నిలువరిస్తుంది. మొక్క కాల్షియం గ్రహించడానికి తోత్పడుతుంది.
News November 21, 2025
మొక్కల్లో బోరాన్ లోపిస్తే ఏం జరుగుతుంది?

బోరాన్ లోపం వల్ల మొక్కలో పెరిగే భాగాలైన వేర్లు, లేత చిగురు, లేత కొమ్మలు, లేత పత్రాలపై ప్రభావం పడుతుంది. ఈ లోపానికి సరైన మొక్కల్లో చిగుర్లు వికృతాకారంలో ఉంటాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపు మీద ఉంటాయి. దీని వల్ల మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుంచి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు చారలుగా మారతాయి. తర్వాత ముడుచుకుపోతాయి.


