News February 10, 2025
పార్వతీపురం జిల్లాలో ఇద్దరు వీఆర్వోలు సస్పెన్షన్

రెవెన్యూ శాఖలోని మ్యూటేషన్లు పరిష్కార నేపథ్యంలో విధుల్లో అలసత్వం వహించిన ఇద్దరు వీఆర్వోలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మరో వీఆర్వోకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆర్టికల్ ఆఫ్ చార్జెస్కు ఆదేశాలు జారీచేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సాలూరు మండలం శివరాంపురం వీఆర్వో దాడి చిన్నయ్య, సీతంపేట మండలం పుల్లిపుట్టి వీఆర్వో ఎ.అయ్యప్ప సస్పెండ్ చేశారు.
Similar News
News November 13, 2025
పాలమూరు: జాబ్ మేళా..70 మంది హాజరు

మహబూబ్ నగర్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (పిల్లలమర్రి)లో ఇవాళ మినీ జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ Way2Newsతో తెలిపారు. 5 ప్రైవేట్ సంస్థలలో మొత్తం 385 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 70 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు.
News November 13, 2025
గద్వాల్ కలెక్టర్ను కలిసిన జిల్లా వైద్యాధికారి

గద్వాల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె.సంధ్యా కిరణ్మయి కలెక్టర్ సంతోష్ను కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆయనను కలిసి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ జిల్లాను అన్ని పారామీటర్స్లో ముందు ఉంచాలని, జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
News November 13, 2025
ఢిల్లీ పేలుడు: ఈ లేడీ డాక్టర్తో ఆ కిలేడీకి సంబంధాలు!

ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన Dr షహీన్కు పుల్వామా మాస్టర్మైండ్ ఉమర్ ఫరూఖ్ భార్య అఫీరాతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. అఫీరా, మసూద్ అజార్ చెల్లెలు సాదియా కలిసి షహీన్ను సంప్రదించినట్లు దర్యాప్తు వర్గాలు చెప్పాయి. భారత్లో జైషే మహిళా వింగ్ ఏర్పాటు చేసి మహిళలను రిక్రూట్ చేయాలని చెప్పినట్లు తెలిపాయి. 2019లో ఎన్కౌంటర్లో ఉమర్ హతమయ్యాడు.


