News February 10, 2025
పార్వతీపురం జిల్లాలో ఇద్దరు వీఆర్వోలు సస్పెన్షన్

రెవెన్యూ శాఖలోని మ్యూటేషన్లు పరిష్కార నేపథ్యంలో విధుల్లో అలసత్వం వహించిన ఇద్దరు వీఆర్వోలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మరో వీఆర్వోకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆర్టికల్ ఆఫ్ చార్జెస్కు ఆదేశాలు జారీచేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సాలూరు మండలం శివరాంపురం వీఆర్వో దాడి చిన్నయ్య, సీతంపేట మండలం పుల్లిపుట్టి వీఆర్వో ఎ.అయ్యప్ప సస్పెండ్ చేశారు.
Similar News
News November 26, 2025
ఫైనల్కు ఉమ్మడి ఖమ్మం అండర్-19 గర్ల్స్ జట్టు

సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న అండర్-19 గర్ల్స్ క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. లీగ్ దశలో నాలుగు మ్యాచ్లలోనూ విజయం సాధించి పూల్ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో మెదక్ జట్టుపై గెలిచిన ఖమ్మం జట్టు ఫైనల్కు చేరుకుంది. ఫైనల్ పోరులో ఖమ్మం, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
News November 26, 2025
సేంద్రియ పెంపకం యూనిట్ను సందర్శించిన కలెక్టర్

సేంద్రియ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం పాల్వంచ కొత్తూరులోని చరిత సేంద్రియ కౌజు పిట్టల పెంపకం యూనిట్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ పద్ధతులు, పరిశుభ్రత ప్రమాణాలు, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ విధానాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.
News November 26, 2025
బిడ్డకు జన్మనిచ్చిన ‘బ్లూడ్రమ్’ ముస్కాన్.. DNA టెస్టుకు డిమాండ్

UP మీరట్లో ప్రియుడితో కలిసి భర్తను చంపి బ్లూడ్రమ్లో పాతేసిన <<16560833>>ముస్కాన్<<>> తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త సౌరభ్ పుట్టినరోజునే(NOV 24) బిడ్డ పుట్టడం గమనార్హం. దీంతో ఆ చిన్నారికి DNA టెస్టు నిర్వహించాలంటూ మృతుడి సోదరుడు రాహుల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెద్ద కూతురు విషయంలోనూ అతను పిల్ వేయగా తీర్పు వెలువడలేదు. వారిద్దరూ సౌరభ్ పిల్లలుగా తేలితే తామే పోషిస్తామని అతను చెబుతున్నాడు.


